అక్షరటుడే, వెబ్డెస్క్ : Assembly Whips Appointment | అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల (Budget Sessions) సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శాసన సభ, మండలికి కొత్త విప్లను నియమించింది.
శాసనసభ (Assembly) ప్రభుత్వ విప్లుగా ఎమ్మెల్యేలు విజయరమణ రావు, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, వేముల వీరేశం నియమితులయ్యారు. మండలిలో ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్లను ప్రభుత్వం విప్లుగా నియమిచింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు (CS Ramakrishna Rao) ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకాలు మార్చి 18 నుంచి అమలులోకి వస్తాయని తెలిపారు. ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్న సమయంలో కొత్త విప్ల నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది.
Assembly Whips Appointment | వారికి ప్రాధాన్యం
అద్దంకి దయాకర్, బల్మూర్ వెంకట్ విద్యార్థి, యూత్ లీడర్లుగా కాంగ్రెస్లో ప్రస్థానం ప్రారంభించి కీలక స్థానాలకు చేరారు. విప్ల నియామకంలో ప్రభుత్వం వీరికి ప్రాధాన్యత ఇవ్వడం గమనార్హం. మరోవైపు శాసన సభలో విప్లుగా నియామకం అయిన వారిలో వేముల వీరేశం నకిరేకల్ ఎమ్మెల్యేగా, విజయ రమణారావు పెద్దపల్లి ఎమ్మెల్యేగా, యెన్నం శ్రీనివాస్ రెడ్డి మహబూబ్నగర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.
దీనిని కూడా చదవండి : CS Tenure Extension | సీఎస్ పదవీకాలం పొడిగింపు.. రిటైర్డ్ ఐపీఎస్ సంచలన లేఖ

