అక్షర టుడే, బాల్కొండ: Balkonda House Theft | తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగిన ఘటన నిజామాబాద్ జిల్లా బాల్కొండలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై బాల్కొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Balkonda House Theft | ఇంటికి తాళం వేసి..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాల్కొండకు చెందిన తౌటు రాజు (50) సోమవారం ఉదయం ఇంటికి తాళం వేసి బోథ్ వెళ్లారు. మధ్యాహ్నం తిరిగి ఇంటికి వచ్చి చూడగా తలుపు తెరిచి ఉంది. ఇంట్లోని సామాను చిందరవందరగా పడిఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు.
ప్రత్యేక బృందాలతో గాలింపు..
తాళం పగలగొట్టిన దొంగలు ఇంట్లోకి చొరబడి ఒక మోబైల్తోపాటు రూ. 4ం వేల నగదు ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని, నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు పని చేస్తున్నాయని బాల్కొండ ఎస్సై శైలేందర్ తెలిపారు.
ఇది కూడా చదవండి: POCSO Case Verdict | కామారెడ్డి కోర్టు సంచలన తీర్పు.. పోక్సో కేసు నిందితుడికి ఇరవై ఏళ్ల జైలు..

