అక్షరటుడే, ఇందూరు: Bhadrachalam Kalyana Talambralu | శ్రీరామ నవమి (sri rama navami) పర్వదినం సందర్భంగా భద్రాద్రి సీతారామ చంద్ర స్వామి కల్యాణ తలంబ్రాలను నేరుగా భక్తుల ఇంటికే (talambralu home delivery) అందించనున్నారు. ఈ మేరకు నిజామాబాద్ పోస్టల్ (india post service) అధికారులు వివరాలు వెల్లడించారు.
Bhadrachalam Kalyana Talambralu | తెలంగాణ పోస్టల్ సర్కిల్ ఆధ్వర్యంలో..
ప్రతి ఏడాదిలాగే.. రామనవమి కల్యాణానికి వెళ్లలేని భక్తుల కోసం పవిత్ర తలంబ్రాలను (bhadrachalam kalyana talambralu) నేరుగా ఇంటివద్దకే పొందేందుకు తెలంగాణ ఎండోమెంట్స్ శాఖ సహకారంతో ఈ కార్యక్రమం చేపడుతోంది. రాష్ట్రంలోని అన్ని పోస్టాఫీస్ల ద్వారా భక్తులు కింది సేవలను పొందవచ్చు.
Bhadrachalam Kalyana Talambralu | సేవలు.. వాటి వివరాలు..
భద్రాద్రి రామాలయంలో అంత్రాలయ అర్చన.. కల్యాణ (bhadrachalam temple) తలంబ్రాలు.. ప్యాకెట్ (ఒక ముత్యం, కుంకుమ, మిశ్రీ, కాజు గింజలు కలిగి ఉన్న ప్యాకెట్ పార్శిల్ ద్వారా పొందవచ్చు. దీని కోసం రూ.450 చెల్లించాల్సి ఉంటుంది.
ముత్యాల తలంబ్రాలు..
భద్రాచల సీతారామ స్వామి కల్యాణ తలంబ్రాలు ప్యాకెట్ (ఒక ముత్యం కలిగి ఉంటుంది). ఈ తలంబ్రాలు కావాల్సిన వారు రూ.151 పోస్టాఫీస్లో చెల్లించాల్సి ఉంటుంది.
స్పీడ్పోస్ట్ ద్వారా..
సర్వీస్ను బుక్ చేసుకున్న భక్తులకు సీతారామచంద్ర కల్యాణోత్సవం అనంతరం తలంబ్రాలు స్పీడ్ పోస్ట్ ద్వారా భక్తుల గృహాలకు నేరుగా పంపిణీ చేయబడతాయి. భద్రాద్రిలో మార్చి 27న నిర్వహించనున్న రామనవమి మహోత్సవాలకు హాజరుకాలేని భక్తులకు ఈ సేవ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పోస్టల్ అధికారులు పేర్కొంటున్నారు.

ఇది కూడా చదవండి: Indalwai Student | విద్యార్థి ఆత్మహత్య ఘటనపై కలెక్టర్ సీరియస్.. నలుగురు ఉద్యోగుల సస్పెన్షన్

