అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Bike Theft Gang | వరుస చోరీలకు పాల్పడుతున్న బైక్ దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు బుధవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో (Police Station) ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీ సాయి చైతన్య (CP Sai Chaitanya) వివరాలు వెల్లడించారు.
Bike Theft Gang | నిందితుల వివరాలు..
నిజామాబాద్, (Nizamabad) నిర్మల్ జిల్లాల్లో జరిగిన వరుస బైక్ చోరీలకు సంబంధించి పోలీసులు ఆయా పోలీస్స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. అనంతరం సాంకేతిక పరిజ్ఞానంతో దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో ధర్మాబాద్లో నివాసం ఉంటున్న బాసర గ్రామానికి చెందిన షేక్ అర్బాజ్, దెగ్లూర్ నాఖాకు చెందిన పేరు షేక్ అరిబ్, ధర్మాబాద్కు చెందిన షేక్ అర్బాజ్ రెహమత్, ధర్మాబాద్ మండలం జరికోట్ గ్రామానికి చెందిన సోన్ కాంబ్లే, మనోజ్ శంకర్, నాయగావ్ తాలుకా టెంబర్నీ గ్రామానికి చెందిన చెందిన షేర్ అలీ, షాదుల్ షేక్లను అరెస్ట్ చేసినట్లు సీపీ వివరించారు. బాసర గ్రామానికి చెందిన అవేజ్, షేక్ ఇమ్రాన్ అలియాస్ అబూ అలియాస షేక్ సమీర్లు పరారీలో ఉన్నట్లు వివరించారు. అనంతరం వివిధ ప్రాంతాల్లో చోరీ చేసిన 17 మోటార్ సైకిళ్లను వారి వద్ద నుంచి పోలీసులు రికవరీ చేశారు.
Bike Theft Gang | వాహనాలు తనిఖీ చేస్తుండగా..
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. చోరీ కేసులో అరెస్ట్ అయినవాళ్లలో కొందరిపై ఇప్పటికే పలు చోరీ కేసులు నమోదై ఉన్నాయన్నారు. రెండేళ్లుగా షేక్ అర్బాజ్ అలియాస్ మాయ, షేక్ ఇమ్రాన్ అలియాస్అబూ అలియాస్ షేక్ సమీర్, షేక్ ఆరిబ్, షేక్ రెహమాన్ అంతా కలిసి ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడ్డారని తెలిపారు. 17 బైక్లను బాసరకు చెందిన ఆవేజ్, ధర్మాబాద్కు చెందిన షేక్ అర్బాజ్ రెహమత్, సోంకాంబ్లే మనోజ్, షేర్ షాదుల్ షేక్ తక్కువ ధరకే ఈ నిందితుల వద్ద బైక్లు కొనుగోలు చేసేవారని తెలిపారు. 17న సాయంత్రం అయ్యప్ప టెంపుల్ నవీపేట్ వద్ద వాహనాల తనిఖీలు చేస్తుండగా.. పోలీసులను చూసి పారిపోతుండగా నిందితులను పట్టుకున్నామన్నారు.

రెండు జిల్లాలకు చెందిన 15 కేసులను చేధించినట్లు సీపీ తెలిపారు. నిందితులను న్యాయస్థానంలో హాజరుపర్చి రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. కేసు ఛేదనలో కృషి చేసిన నిజామాబాద్ డివిజన్ ఏసీపీ ప్రకాష్ యాదవ్, సీసీఎస్ ఏసీపీ మస్తాన్ అలీ పర్యవేక్షణలో నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ సాయినాథ్, ఎస్సై మహేష్, నవీపేట్ ఎస్సై శ్రీకాంత్, సీసీఎస్ హెడ్ కానిస్టేబుల్ ఠాకూర్, రాజేందర్ సింగ్, సీసీఎస్ కానిస్టేబుల్స్ రవికృష్ణ, సర్దార్ నరేష్ యాదవ్, నరేష్ కుమార్, వసీం, రాజేంద్రప్రసాద్, క్రైం పార్టీ హెచ్సీ రాజేశ్వర్, రాజారెడ్డి, శ్రీకాంత్ గౌడ్, దత్తుగౌడ్, రాకేశ్, నాగరాజు, శంకర్, భాస్కర్ ఇతర సిబ్బందిని సీపీ అభినందించారు.
ఇది కూడా చదవండి..: Car Fire Accident | రన్నింగ్ కారులో చెలరేగిన మంటలు..

