అక్షరటుడే, ఆర్మూర్ : Bikes | జక్రాన్పల్లి మండలం (Jakranpalli Mandal) తొర్లికొండ గ్రామంలో మంగళవారం రాత్రి ఇంటి బయట నిలిపి ఉంచిన రెండు ద్విచక్ర వాహనాలను దుండగులు దహనం చేశారు.
Bikes | వాహనాలు దహనం
తొర్లికొండ గ్రామానికి చెందిన సింగారం వెంకటరమణ, సింగారం శ్రీకాంత్ ఇద్దరు అన్నదమ్ములకు చెందిన రెండు ద్విచక్ర వాహనాలను రోజూ మాదిరిగానే వారి ఇంటి ఎదుట నిలిపి పడుకున్నారు. కాగా.. రాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు వారి వాహనాలను దహనం చేశారు. కాగా.. ఈ విషయమై జక్రాన్పల్లి పోలీసుల (Jakranpalli Police)కు బాధితులు ఫిర్యాదు చేశారు. సంఘటన జరిగిన ఇంటిముందు, చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాల్లో నిందితుల ఆధారాలను సేకరిస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Heart Attack | ఆడుకుంటూ కుప్పకూలిన చిన్నారి.. గుండెపోటుతో మృతి చెందడంతో తీవ్ర విషాదం
