అక్షరటుడే, వెబ్డెస్క్ : BJP Bengal Candidates | దేశంలోని నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఎన్నికల సంఘం (Election Commission) ఆదివారం షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో ఆయా రాష్ట్రాల్లో పాగా వేయాలని బీజేపీ (BJP) కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, కేరళలో సత్తా చాటాలని కాషాయ పార్టీ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా ఆయా రాష్ట్రాల్లో ఆ పార్టీ తన అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది.
పశ్చిమ బెంగాల్లో అధికారం కోసం కమలం పార్టీ అనేక ప్రయత్నాలు చేస్తోంది. గత ఎన్నికల్లో సైతం తీవ్రంగా శ్రమించినా బెంగాల్ ఓటర్లు టీఎంసీ (TMC)కి పట్టం కట్టారు. బీజేపీ 77 సీట్లు గెలిచినా.. 38 శాతం ఓట్లు సాధించింది. దీంతో ఈ ఎన్నికల్లో ఎలాగైనా ముఖ్యమంత్రి పదవి దక్కించుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. ఇటీవల బీహార్లో ఎన్డీఏ (NDA) ఘన విజయం సాధించిన అనంతరం మోదీ మాట్లాడుతూ.. తర్వాత బెంగాల్ అని తెలిపారు. ఈ ఎన్నికలు టీఎంసీ, బీజేపీకి మధ్య హోరాహోరీగా సాగనున్నాయి. ఈ క్రమంలో బీజేపీ బెంగాల్లో తన అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది.
BJP Bengal Candidates | 144 మంది పేర్లు ప్రకటన
పశ్చిమ బెంగాల్లో మొత్తం 292 సీట్లు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 23, 29 తేదీల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. దీంతో కాషాయ పార్టీ మొదటి విడతలో 144 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఆ పార్టీ నేత సువేందు అధికారి (Suvendu Adhikari) రెండు చోట్ల పోటీ చేస్తున్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా సువేందు అధికారి కొనసాగుతున్నారు. ఆయన నందిగ్రామ్, భబానీపూర్ నుంచి పోటీ చేయనున్నారు.
BJP Bengal Candidates | మమత బెనర్జీపై..

గత ఎన్నికల్లో సువేందు అధికారి సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee)పై పోటీ చేసి గెలుపొందారు. నందిగ్రామ్లో మమతాను ఆయన ఓడించారు. దీంతో మమత భబానిపూర్లో గెలిచిన ఎమ్మెల్యేతో రాజీనామా చేయించి ఉప ఎన్నికల్లో గెలిచారు. దీంతో మరోసారి సువేంద్ అధికారి మమత గతంలో పోటీ చేసిన, ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న రెండు స్థానాల్లో పోటీ చేస్తున్నారు. 2021 ఎన్నికలలో అధికారి నందిగ్రామ్ స్థానం నుంచి మమతా బెనర్జీపై పోటీ చేసి సుమారు 2 వేల ఓట్ల తేడాతో ఓడించారు.
BJP Bengal Candidates | పోటీ చేస్తున్న ప్రముఖులు
తొలి జాబితాలో పలువురు ప్రముఖులకు బీజేపీ అవకాశం కల్పించింది. దిలీప్ ఘోష్ (మాజీ బీజేపీ అధ్యక్షుడు) ఖరగ్పూర్ సదర్ నుంచి, అగ్నిమిత్ర పాల్ (ఫ్యాషన్ డిజైనర్) అసన్సోల్ దక్షిణ నుంచి బరిలో నిలవనున్నారు. సువేందు అధికారి నందిగ్రామ్, భబానీపూర్, అశోక్ దిండా (మాజీ క్రికెటర్) మోయినా నుంచి, రుద్రనీల్ ఘోష్ (నటుడు): శివపూర్ నుంచి పోటీ చేస్తారు.
దీనిని కూడా చదవండి : Assembly Election Schedule | మోగిన నగారా.. పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్

