అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: BJP Dinesh Kulachari | మాట ఇచ్చి నిలుపుకోవడం బీజేపీ నైజం అని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి అన్నారు. ప్రభుత్వం పంట నష్ట పరిహారం చెల్లింపు విషయమై ధర్పల్లి మండలంలోని (Dharpally Mandal) వాడి గ్రామంలో పెద్దమ్మ గుడి వద్దకు శనివారం ఉదయం దినేష్ కార్యకర్తలతో చేరుకున్నారు. ఆ ప్రాంతానికి వెళ్లకుండా తమను పోలీసులు అడ్డగించారని అయినప్పటికీ బైక్పై గుడి వద్దకు చేరుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
BJP Dinesh Kulachari | మాట తప్పడం కాంగ్రెస్కు అలవాటే..
జిల్లాలో అకాల వర్షాల కారణంగా వందల ఎకరాల్లో పంట నష్టం జరిగితే తాము వెళ్లి బాధితులను పరామర్శించామని దినేష్ కులాచారి (Dinesh Kulachari) అన్నారు. అయితే దీనిపై స్పందించిన రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి (MLA Bhupathi Reddy) తాము ఇప్పటికే పంట నష్ట పరిహారం చెల్లించామని పేర్కొన్నారన్నారు. అయితే ఏ రైతుకు ఎంత పంట నష్టపరిహారం చెల్లాంచారో తమకు ఆధారాలతో చూపించాలని తాము సవాల్ విసిరామని.. పెద్దమ్మగుడికి రావాలని కోరామన్నారు. కానీ ఆధారాలు చూపించలేని రూరల్ ఎమ్మెల్యే ఇక్కడికి రాలేదన్నారు. రైతన్నల కష్టాలను రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం కాంగ్రెస్ పార్టీకి (Congress Party) వెన్నతో పెట్టిన విద్య అని ఆయన విమర్శించారు. పంట నష్టపరిహారం చెల్లించినట్లయితే ఆధారాలతో చూపించడానికి ఏం అభ్యంతరమని ఆయన ప్రశ్నించారు. రైతులకు న్యాయం జరిగే వరకూ బీజేపీ పోరాటం ఆగదని ఈ అబద్ధాల పాలన ముగింపు త్వరలోనే జరుగుతుందని ఆయన జోస్యం చెప్పారు. ఈ సందర్భంగా పెద్దమ్మ గుడి వద్ద దినేష్ కులాచారిని అరెస్ట్ చేసిన పోలీసులు మోపాల్ పోలీస్ స్టేషన్ (Mopal Police Station)కు తరలించారు.
ఇది కూడా చదవండి..: Jyotiba Phule Jayanti | మహనీయుల ఆశయాలను కొనసాగిద్దాం: ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
