అక్షరటుడే, ఇందూరు: BJP Felicitation Meeting | నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో నూతనంగా గెలుపొందిన బీజేపీ కౌన్సిలర్లు (BJP Councilors), కార్పొరేటర్లకు ఈనెల 6న ఆత్మీయ అభినందన సభ నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి (Dinesh Kulachari) తెలిపారు. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేశారు.

BJP Felicitation Meeting | మాధవనగర్లోని కమ్మసంఘంలో..
మాధవ నగర్లోని కమ్మ సంఘంలో ఉదయం 10 గంటలకు సభ ఉంటుందన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేడ్చల్ మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ (MP Dharmapuri Arvind), ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, రాకేష్ రెడ్డి (Rakesh Reddy) పసుపు బోర్డు జాతీయ ఛైర్మన్ పల్లె గంగారెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి స్రవంతి రెడ్డి, జిల్లా ప్రబారి కాంతారావు హాజరవుతారని పేర్కొన్నారు. కావున పార్టీ జిల్లా పదాధికారులు, రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు, వివిధ మోర్చాల జిల్లా పదాధికారులు, మండల అధ్యక్షులు, సర్పంచులు, కార్యకర్తలు హాజరుకావాలని కోరారు.
ఇది కూడా చదవండి..: Omkareshwara Temple Festival | వైభవంగా ఓంకారేశ్వర ఆలయ వార్షికోత్సవం

