అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: BJP Promises Criticism | కేంద్రంలో బీజేపీ ఇచ్చిన హామీలను ముందు నెరవేర్చాలని డీసీసీ అధ్యక్షుడు నగేశ్ రెడ్డి డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
బీజేపీ నాయకులు (BJP Leaders) ఈ నెల 21న కలెక్టరేట్ ముట్టడిస్తామని ప్రకటించారన్నారు. ముందు బీజేపీ ఇచ్చిన హామీలు ఒక్కటైనా నెరవేర్చారా అని ప్రశ్నించారు. బీజేపీ హామీలు నెరవేర్చలేదని ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తున్నారా.. లేదా కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నందుకు ముట్టడి చేస్తున్నారా నిలదీశారు.
BJP Promises Criticism | ఆ హామీలు ఏమయ్యాయి..
కేంద్రంలో బీజేపీ (BJP) అధికారంలోకి రాకముందు నల్లధనాన్ని బయటకు తీస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రతి పేదవాడి అకౌంట్లో రూ. 15 లక్షలు వేస్తామని చెప్పి ఇప్పటివరకు నల్లధనాన్ని బయటకు తీసుకురానందుకు కలెక్టరేట్ (Collectorate) ముట్టడిస్తారా అని ప్రశ్నించారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు రెండు లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని విమర్శించారు. స్థానిక ఎంపీ కేంద్రం నుంచి నిజామాబాద్ జిల్లాకు ఒక్క రూపాయి కూడా నిధులు తీసుకురాలేదన్నారు. జిల్లా అభివృద్ధి గురించి అర్వింద్ ఆలోచించిందే లేదని వ్యాఖ్యానించారు. మాధవనగర్ ఆర్వోబీ పనులు ఏళ్లుగా నత్తనడకన సాగుతున్నా పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు.
BJP Promises Criticism | హామీలు ఒక్కొక్కొటిగా నెరవేరుస్తున్నాం..
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) అధికారంలోకి రాకముందు వరంగల్ డిక్లరేషన్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేస్తున్నామని నగేశ్రెడ్డి వివరించారు. ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లను అందిస్తున్నట్లు చెప్పారు. గత పదేళ్ల బీఆర్ఎస్ (BRS) పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా మంజూరు చేయలేదన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 24 లక్షల కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగిందని వెల్లడించారు. అదేవిధంగా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సన్న బియ్యం ప్రభుత్వమే అందిస్తుందన్నారు.
BJP Promises Criticism | రైతు రుణమాఫీ
అన్నదాతల సంక్షేమం కోసం ప్రభుత్వం రైతు రుణమాఫీ అమలు చేసిందని డీసీసీ అధ్యక్షుడు (DCC President) వివరించారు. సన్నవడ్లకు 500 రూపాయల బోనస్, రైతు భరోసా ద్వారా ఎకరానికి ఏడాదికి రూ.15వేల పెట్టుబడి సాయం అందిస్తోందని చెప్పారు. పేద కుటుంబాలకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ. ఐదు లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పెంచడం జరిగిందని గుర్తు చేశారు. మహిళల కోసం ఉచిత ఉచిత బస్సు సౌకర్యం కల్పించినట్లు వివరించారు. ఇలా అనేక హామీలను నెరవేర్చామని.. కానీ బీజేపీ మాత్రం తమ హామీలను అమలు చేయకుండా ఆందోళనలు చేయడం ఏమిటని ప్రశ్నించారు.
కార్యక్రమంలో పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, సేవాదళ్ అధ్యక్షుడు సంతోష్, జిల్లా ఓబీసీ అధ్యక్షుడు రాజ నరేందర్ గౌడ్, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు యాదగిరి, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు లింగం, కార్పొరేటర్ ప్రవీణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Police Investigation Standards | కేసుల దర్యాప్తులో నాణ్యత ప్రమాణాలు కచ్చితంగా పాటించాలి: ఎస్పీ

