అక్షరటుడే, కామారెడ్డి: BJP Protest Kamareddy | ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై శుక్రవారం కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం (Kamareddy Municipal Office) వద్ద బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
BJP Protest Kamareddy | అమలు కాని హామీలు ఇచ్చి..
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) అలవికాని హామీలను ప్రజలకు ఇచ్చారన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చిన అంశాలను అమలు చేయలేదన్నారు. భూభారతి రెవెన్యూ సదస్సుల్లో రైతులు ఇచ్చిన దరఖాస్తులకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. అర్హులైన పేదలందరికి ఇళ్లు ఇవ్వాలన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ (Kamareddy BC Declaration) ఏమైందని ప్రశ్నించారు. 42శాతం ఇస్తామని చెప్పి 32శాతమే ఇచ్చి కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేసిందన్నారు. విద్యార్థులకు రావాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలన్నారు. ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని, వాటికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. రైతుభరోసా (Rythu Bharosa) డబ్బులు రైతుల ఖాతాల్లో జమచేయాలని, రైతులకు కావాల్సిన యూరియా తక్షణమే అందుబాటులో ఉంచాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు మురళీధర్ గౌడ్, జిల్లా నాయకులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Health Awareness Nizamabad | ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి

