అక్షరటుడే, వెబ్డెస్క్: సూపర్ స్టార్ రజనీకాంత్, హీరో ధనుష్ ఇళ్లలో బాంబులు ఉన్నాయంటూ బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన చెన్నై పోలీసులు బాంబు స్క్వాడ్తో సోదాలు నిర్వహించారు. తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అది ఫేక్ మెయిల్ అని తేల్చారు. ఆకతాయిల పనిగా భావిస్తున్న పోలీసులు, ఐపీ అడ్రస్ ఆధారంగా నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అలాగే ఇద్దరు నటుల ఇళ్ల దగ్గర భద్రతను పెంచారు.
Bomb Threat | డీజీపీ కార్యాలయానికి మెయిల్
వివరాల్లోకి వెళ్తే.. ప్రముఖ నటులు రజనీకాంత్, ధనుష్ ఇళ్లల్లో బాంబులు పెట్టినట్లు తమిళనాడు డీజీపీ కార్యాలయానికి శనివారం బెదిరింపు మెయిల్ వచ్చింది. అందులో సూపర్ స్టార్ రజనీకాంత్ ఇంట్లో, హీరో ధనుష్ నివాసంలో బాంబులు పెట్టినట్లు పేర్కొన్నారు.
Bomb Threat | బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లతో తనిఖీలు
దీంతో పోలీసులు అలెర్ట్ అయిన పోలీసులు బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లతో కలిసి రంగంలోకి దిగారు. సుమారు గంటన్నరపాటు క్షుణ్ణంగా సోదాలు చేశారు. ఇంటి లోపల, గార్డెన్ ప్రాంతం, పరిసరాల్లో గాలించారు. ఎలాంటి పేలుడు పదార్థాలు కానీ, అనుమానాస్పద వస్తువులు కనిపించలేదు. దీంతో ‘ఫేక్ మెయిల్’ అని అధికారులు తెలిపారు. గతంలో కూడా హీరో విజయ్, అజిత్ లాంటి ప్రముఖుల ఇళ్లకు కూడా ఇలాంటి బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే.
ఇది కూడా చదవండి..: Modi Attacks TMC | టీఎంసీలో వణుకు పుడుతోంది..: ప్రధాని మోదీ
