అక్షరటుడే, ఇందూరు: Brahmotsavam Festival Induru | దేవదేవుడిని మనస్పూర్తిగా నమ్మి, బ్రహ్మోత్సవాల్లో కొలిస్తే తీరని కోరికలు కూడా నెరవేరుతాయని దేవనాథ జీయర్ స్వామి (Devanatha Jeeyar Swami) అన్నారు. నర్సింగ్పల్లిలోని ఇందూరు తిరుమలలో సోమవారం రెండోరోజు బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి.
Brahmotsavam Festival Induru | దేవదేవుడిని నమ్మితే..
ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ.. మానసావాచ కర్మనా దేవదేవుడిని నమ్మితే కలికాలంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవన్నారు. ఉత్సవం అంటే లోకం అంతా సంతోషించడం.. బ్రహ్మోత్సవం అంటే సాక్షాత్తు బ్రహ్మనే లోకకల్యాణం కోసం జరిపించే ఉత్సవమన్నారు. సకల మనోవాంఛలను దేవదేవుడికి చేర్చేది గరుత్మంతుడన్నారు. గరుడు మనోవేగం కంటే వేగంగా ప్రయాణం చెయ్యగలుగుతాడని చెప్పారు.

Brahmotsavam Festival Induru | ఆలయ ధర్మకర్తలు దిల్రాజు..
కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు దిల్ రాజు, (Dil Raju) శిరీష్ రెడ్డి, నరసింహారెడ్డి, విజయసింహారెడ్డి, యజ్ఞాచార్యులు, శ్రీనివాసాచార్య, లక్ష్మణాచార్య, శ్రీకరాచార్య, ఆలయ ప్రధాన అర్చకులు రోహిత్ కుమారాచార్య, ఆలయ సేవకులు అశోక్, నరాల సుధాకర్, గంగాధర్, ప్రసాద్, రాజేశ్వ,ర్ రమేష్, సాయిలు, భాస్కర్, మురళి, ప్రమోద్, గంగారెడ్డి పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Induru Tirumala Brahmotsavam | నేత్రపర్వంగా ఇందూరు తిరుమల పుష్కర బ్రహ్మోత్సవాలు

