అక్షరటుడే, ఇందూరు: Brahmotsavam Homam | బ్రహ్మోత్సవాల్లో నిర్వహించే హోమాలకు రెట్టింపు శక్తి ఉంటుందని దేవనాద జీయర్ స్వామి తెలిపారు. ఇందూరు తిరుమల (Indore Tirumala)గోవింద వనమాల క్షేత్రంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు బుధవారం సర్వరక్షకర సుదర్శన నరసింహ హవన కార్యక్రమం నిర్వహించారు.
Brahmotsavam Homam |ఆరోగ్యం, సందద..
ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ.. ఆరోగ్యం, సంపద, మంచిబుద్ధిని సర్వ రక్షాకర సుదర్శన నరసింహ హోమం ప్రసాదిస్తుందన్నారు. విష్ణువుని దర్శింపచేసేది సుదర్శన భగవానుడేనని తెలిపారు సకల ద్రవ్యాల్లో సకల వస్తువుల్లో వ్యాప్తి చెంది ఉన్న మహావిష్ణువుని మామూలు చూపుతో దర్శింప చేయడం సాధ్యం కాదని కాబట్టి సుదర్శన భగవానుడి అనుగ్రహం వల్లనే దర్శన భాగ్యం కలుగుతుందన్నారు. కాదా నాలుగో రోజు బ్రహ్మోత్సవాల్లో బొమ్మరిల్లు సినిమా డైరెక్టర్ భాస్కర్, ప్రముఖ ఛాయాగ్రహకుడు విజయ చక్రవర్తి, సినీ నిర్మాతలు కృష్ణ, సత్యనారాయణ రెడ్డి, మహేందర్ హాజరయ్యారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు సినీ నిర్మాతలు దిల్ రాజు, (Dil Raju) శిరీష్ రెడ్డి దంపతులు ప్రధాన ధర్మకర్త నరసింహారెడ్డి దంపతులు విజయసింహారెడ్డి దంపతులు మాజీ ఎంపీటీసీ రాములు, నరాల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Water Tank Inspection | వాటర్ ట్యాంక్ ఎక్కిన కలెక్టర్.. పరిశుభ్రత కార్యక్రమం పరిశీలన

