అక్షరటుడే, వెబ్డెస్క్ : Census 2026 | రాష్ట్రంలో మొదటి దశ జన గణన ప్రక్రియ మే 11 నుంచి ప్రారంభం కానుంది. సీఎస్ రామకృష్ణారావు మంగళవారం తెలంగాణ సెన్సస్ ఆపరేషన్స్ డైరెక్టర్ (Telangana Census Operations Director) భారతి హోళికేరితో కలిసి కలెక్టర్లతో సమగ్ర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జనాభా లెక్కింపు ప్రక్రియపై పలు సూచనలు చేశారు.
Census 2026 | సీఎస్ మాట్లాడుతూ..
జనాభా లెక్కింపు పూర్తిగా డిజిటల్ (Digital) విధానంలో జరగనుందన్నారు. మొత్తం ప్రక్రియను మొబైల్ అప్లికేషన్ ద్వారా నిర్వహిస్తారని చెప్పారు. ఖచ్చితత్వం, పారదర్శకత సమాచారం వేగవంతమైన ప్రాసెసింగ్ను అనుమతిస్తుందన్నారు. మే 11 నుంచి రాష్ట్రవ్యాప్తంగా హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్ (HLO) ప్రారంభమవుతుందని ఆయన వెల్లడించారు. HLO కి 15 రోజుల ముందు స్వీయ-గణన ప్రారంభం అవుతుందన్నారు. ప్రజలు తమ వివరాలను స్వచ్ఛందంగా ఆన్లైన్లో సమర్పించడానికి వీలు ఉందన్నారు.
Census 2026 | పకడ్బందీగా..
జనగణనను పకడ్బందీగా చేపట్టాలని సీఎస్ సూచించారు. కలెక్టర్లు తమ పరిధిలో పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు, ఏ ఇల్లు, మారుమూల స్థావరం, గిరిజన గ్రామాలను కూడా వదిలి వేయొద్దన్నారు. పూర్తి డిజిటల్ జనాభా గణన విజయం, క్షేత్ర స్థాయి సిబ్బంది సాంకేతిక నైపుణ్యం, సంసిద్ధతపై ఆధారపడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రతి దశలో సజావుగా సాంకేతిక ఏకీకరణను సులభతరం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. గణన బ్లాక్ల తుది నిర్ణయం, అధికార పరిధి సరిహద్దుల ధృవీకరణ వంటి అంశాలను భారతి హోళికేరి వివరించారు.
ఇది కూడా చదవండి..:SIM Binding Implementation | నేటి నుంచి సిమ్ బైండింగ్.. మొబైల్ వినియోగంలో కఠిన నిబంధన!

