అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: CITU Noorjahan | సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ (Noorjahan) మృతిచెందారు. అనారోగ్యం కారణంగా కొన్నిరోజులుగా చికిత్స పొందుతున్న ఆమె శనివారం మృతి చెందారు.
CITU Noorjahan | కార్మికుల హక్కుల కోసం ఏళ్లుగా పోరాటం..
కొన్నేళ్లుగా నూర్జహాన్ సీఐటీయూలో(CITU Nizamabad) కొనసాగారు. ఆమె ఆశావర్కర్లు, గ్రామ పంచాయతీ కార్మికులు (Panchayat Workers) హక్కుల కోసం నిరంతర పోరాటాలు చేశారు. కేంద్ర, రాష్ట్ర కార్మిక వ్యతిరేక విధానాలపై గళమెత్తారు. మహిళలు, యువతులపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు కఠిన చట్టాలు (Nizamabad News) రావాలని ఆమె డిమాండ్ చేసేవారు. అయితే కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె చికిత్స పొందుతూ మృతి చెందారు.
ఇది కూడా చదవండి: Modi Rahul Interaction | పార్లమెంట్ ఆవరణలో అరుదైన సన్నివేశం.. మోదీ – రాహుల్ గాంధీ మాటామంతి
