అక్షరటుడే, వెబ్డెస్క్ : CM Revanth Reddy | అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (Budger Session) వాడీవేడిగా సాగుతున్నాయి. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ముఖ్యంగా రాఘవ కన్స్ట్రక్షన్ వ్యవహారంపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఆదివారం సభలో సీఎం మాట్లాడుతూ.. బీఆర్ఎస్ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణకు ఎస్సీని తొలి సీఎం చేస్తానని కేసీఆర్ (KCR) మాట తప్పారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ హయంలో దళితులను చిన్న చూపు చూశారని ఆరోపించారు. తామ ప్రభుత్వంలో
ప్రజా ప్రభుత్వంలో భట్టి విక్రమార్క, సీతక్క వంటి దళిత, గిరిజన నేతలకు సముచిత స్థానం కల్పించామన్నారు. దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని స్పీకర్ చేశామన్నారు. స్పీకర్ స్థానంలో దళితుడు ఉండటంతోనే కేసీఆర్ సభకు రావడం లేదని ఆరోపించారు. గతంలో పదవులన్నీ ఒకే కుటుంబానికి దక్కాయని విమర్శించారు.
CM Revanth Reddy | హరీశ్రావు తమ్ముడి అక్రమాలు
ధరణిని అడ్డం పెట్టుకొని మహబూబ్నగర్ జిల్లా బాలానగర్లో హరీష్ రావు తమ్ముడు (Harish Rao Brother) మహేశ్ రావు, మామ హన్మంతరావు వందల కోట్ల భూమిని లాక్కున్నారని సీఎం ఆరోపించారు. సేల్ డీడ్ లేకుండా కంపెనీ యజమానులను బెదిరించి దౌర్జన్యంగా భూ బదలాయింపు చేసుకున్న దానిపైన హౌజ్ కమిటి వేయడానికి తాము సిద్ధం అన్నారు. బాలనగర్లో వందల కోట్ల భూమి కొల్లగొట్టిన విషయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఎన్నో సార్లు బతిమిలాడితే దానికి సహకరించలేదని బురద చల్లె ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. హరీష్ రావు, కేటీఆర్ కోట్ల రూపాయల అక్రమస్తుల సంపాదించి రాష్ట్రాన్ని కొల్లగొట్టారన్నారు.
CM Revanth Reddy | వారిని జైలులో పెట్టాలి
కాళేశ్వరాన్ని బీఆర్ఎస్ ఏటీఎంలా మార్చుకుందని సీఎం అన్నారు. అమిత్ షా కూడా ఇక్కడకు వచ్చి అదే చెప్పారని గుర్తు చేశారు. బీజేపీ నాయకుల మాటలు నమ్మి కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించామన్నారు. ఇంతవరకు బీఆర్ఎస్ నాయకులపై చర్యలు ఎందుకు తీసుకోలేదన్నారు. కేసీఆర్, హరీష్ రావులను జైల్లో పెట్టిన తర్వాతే బీజేపీ సూచనలు చేయాలన్నారు. రాష్ట్రంలో అక్రమ మైనింగ్పై సీబీఐ విచారణకు సైతం తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కాగా రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి మైనింగ్పై ఇప్పటికే సీఎం సీఐడీ విచారణకు ఆదేశించారు.
CM Revanth Reddy | బీఆర్ఎస్ సభ్యుల సస్పెన్షన్
రాఘవ కన్స్ట్రక్షన్పై హౌజ్ కమిటీ వేయాలని బీఆర్ఎస్ సభ్యులు డిమాండ్ చేశారు. అలాగే సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై నిరసన తెలిపారు. ఈ మేరకు స్పీకర్ పొడియం ఎదుట ఆందోళన చేపట్టారు. స్పీకర్ చెప్పినా వినకపోవడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రెండు రోజుల పాటు స్పీకర్ సస్పెండ్ చేశారు.
దీనిని కూడా చదవండి : Illegal Mining Probe | సీఎం సంచలన నిర్ణయం.. అక్రమ మైనింగ్పై సీబీసీఐడీ విచారణకు ఆదేశం
