అక్షరటుడే, ఆర్మూర్/భీమ్గల్/బాల్కొండ: Collector Ila Tripathi Inspection | మండల కేంద్రంలోని మైనారిటీ రెసిడెన్షియల్ బాలికల విద్యాలయాన్ని, మోడల్ స్కూళ్లను కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) సోమవారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. స్టోర్ రూమ్, కిచెన్ తదితర వాటిని పరిశీలించారు. స్టోర్ రూమ్లో నిల్వ ఉంచిన సన్నబియ్యం, ఇతర సరుకుల నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులకు ప్రతిరోజూ మెనూ ప్రకారం రుచికరమైన పౌష్టికాహారం అందిస్తున్నారా అని ఆరా తీశారు.
Collector Ila Tripathi Inspection | కేర్టేకర్ ప్రవర్తనపై ఆగ్రహం..
ఈ సందర్భంగా మోడల్ స్కూల్ (Telangana education department) కేర్ టేకర్ ఎం.వీణ విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ, తమతో అనుచితంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థినులు, సిబ్బంది కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్ విద్యార్థినులతో ప్రత్యేకంగా భేటీ అయి, పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేర్ టేకర్ రెగ్యులర్గా విధులకు హాజరు కారని, తమ బాగోగుల గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదని, మెనూ ప్రకారం భోజనం అందించడం లేదని వారు తెలిపారు. హాస్టల్లో నీటికొరత తీవ్ర స్థాయిలో నెలకొని ఉన్నప్పటికీ ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడం లేదని వారు వాపోయారు.
Collector Ila Tripathi Inspection | పరుష పదజాలంతో..
సదరు కేర్ టేకర్ తమను కూడా పరుష పదజాలాలతో దూషిస్తూ, అనుచితంగా ప్రవర్తిస్తున్నారని మోడల్ స్కూల్ (Model school inspection) సిబ్బంది సైతం కలెక్టర్ ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. దీనిని తీవ్రంగా (Armoor News) పరిగణించిన కలెక్టర్, మోడల్ స్కూల్ కేర్ టేకర్ వీణ తీరుపై తక్షణ విచారణకు ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జీఈసీవో భాగ్యలక్ష్మి, ఇన్ఛార్జి ప్రిన్సిపాల్ శ్రీనివాస్ విచారణ జరిపి నివేదిక సమర్పించారు. వారి నివేదిక ఆధారంగా కేర్ టేకర్ వీణను విధుల నుంచి తొలగిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, విద్యార్థుల ప్రయోజనాల విషయంలో ఎంతమాత్రం రాజీ పడబోమని ఈ సందర్భంగా కలెక్టర్ స్పష్టం చేశారు. మోడల్ స్కూల్లో నీటి కొరతను శాశ్వతంగా పరిష్కరించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు.
Collector Ila Tripathi Inspection | మైనారిటీ రెసిడెన్షియల్ బాలికల విద్యాలయం..
అంతకుముందు కలెక్టర్ మైనారిటీ రెసిడెన్షియల్ (Minority residential school) బాలికల విద్యాలయాన్ని సందర్శించారు. అటెండెన్స్ రిజిస్టర్ తనిఖీ చేసి సిబ్బంది హాజరును పరిశీలించారు. పదోతరగతి గదిని సందర్శించి, విద్యార్థినులకు గణితంలో పలు ప్రశ్నలు వేసి, వారి అభ్యసనా సామర్థ్యాలను అంచనా వేశారు. సరైన సమాధానాలు చెప్పిన బాలికలను అభినందిస్తూ, చాక్లెట్ బాక్సులు అందజేశారు. పరీక్షలు సమీపించినందున ఏకాగ్రతతో చక్కగా చదువుకోవాలని, కేవలం పాస్ మార్కులు కాకుండా అత్యుత్తమ గ్రేడ్ పాయింట్లతో ఉత్తీర్ణత సాధించాలని స్ఫూర్తి కలిగించారు. గతేడాది 100 శాతం ఉత్తీర్ణత నమోదైందని ప్రిన్సిపాల్ తెలుపగా, ఈసారి కూడా వందశాతం ఫలితాలు వచ్చేలా విద్యార్థినులను పరీక్షలకు సన్నద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు. తాను మరోమారు ఆకస్మిక తనిఖీకి వస్తానని, పాఠశాల నిర్వహణను మరింతగా మెరుగుపర్చాలని ఆదేశించారు.

ఇది కూడా చదవండి: ACB Catches SI | లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన ఇద్దరు ఎస్సైలు

