అక్షరటుడే, ఎల్లారెడ్డి: Collector Lunch Students | జుక్కల్ మండలంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) శుక్రవారం విస్తృతంగా పర్యటించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు.
Collector Lunch Students | ఇందిరమ్మ ఇళ్ల పరిశీలన..
ఈ సందర్భంగా ముందుగా ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Houses) నిర్మాణ కార్యక్రమంలలో భాగంగా జుక్కల్ మండలంలో ఇళ్ల పనుల పురోగతిని సబ్ కలెక్టర్ కిరణ్మయితో కలిసి కలెక్టర్ పరిశీలించారు. నిర్మాణ నాణ్యత, పనుల వేగం గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. త్వరగా పూర్తిచేసి గృహ ప్రవేశాలకు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. తదనంతరం ఆక్సిజన్ పార్క్ (Oxygen Park)ను సందర్శించి అక్కడి అభివృద్ధి పనులను పరిశీలించారు. పార్కులో వృక్షాల సంరక్షణ, ప్రజలకు అందుబాటులో ఉన్న సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు.

Collector Lunch Students | కేజీబీవీ విద్యాలయం తనిఖీ..
అనంతరం కేజీబీవీ (KGBV) విద్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన పథకం కింద విద్యార్థులకు మెనూ ప్రకారం ఆహారం అందిస్తున్నారా లేదా అన్నది పరిశీలించారు. మెనూలో క్యారెట్ కర్రీ, సాంబారు, టమాట చారు, కోడి గుడ్డు, పెరుగు, నెయ్యి అందిస్తున్నట్లు గమనించారు. ఆహార నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం చేసి, వారితో ముచ్చటిస్తూ వారి విద్య, వసతి, ఆహారం తదితర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. తనిఖీల్లో పీడీ హౌసింగ్ విజయపాల్ రెడ్డి, డీఈవో రాజు, డీపీవో మురళి, తహశీల్దార్, సంబంధిత అధికారులు ఉన్నారు.
ఇది కూడా చదవండి..: DCC Kamareddy Leaders | పార్టీ బలోపేతం దిశగా పనిచేస్తాం..

