అక్షరటుడే, వెబ్డెస్క్ : Congress Office Dispute | కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ జిల్లా (Nizamabad District) కార్యాలయంలో నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. డీసీసీ అధ్యక్షుడు నగేశ్రెడ్డి, ఎన్ఎస్యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణురాజ్ మధ్య గొడవ జరిగింది.
రాష్ట్ర కో ఆపరేటివ్ యూనియన్ ఛైర్మన్, డీసీసీ మాజీ అధ్యక్షుడు మానాల మోహన్రెడ్డి (Manala Mohan Reddy) పుట్టిన రోజు వేడుకలను బుధవారం పార్టీ కార్యాలయంలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. వేణురాజ్ ఆధ్వర్యంలో కార్యకర్తలు కేక్ చేయడానికి యత్నించారు. అయితే వారిని జిల్లా అధ్యక్షుడు నగేశ్రెడ్డి, ఇతర నాయకులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. జిల్లా అధ్యక్షుడికి, వేణురాజ్కు మధ్య మాటల యుద్ధం నడిచింది. ఒకరిపై ఒకరు అరుచుకున్నారు.
Congress Office Dispute | చర్యలు తీసుకుంటాం
కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నగేశ్రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ కార్యాలయం (Party Office)లో ముఖ్య నాయకుల బర్త్డే వేడుకలు మాత్రమే జరపాలన్నారు. సీఎం, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నాయకుల పుట్టిన రోజు వేడుకలు మాత్రమే నిర్వహించాలన్నారు. తన బర్త్డే కూడా జరుపొద్దని సూచించారు. అలా కాకుండా పార్టీ నిబంధనలు ఉల్లంఘిస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయినా కూడా ఎన్ఎస్యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణురాజ్ ఆధ్వర్యంలో మానాల మోహన్రెడ్డి బర్త్ డే వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేశారు. జిల్లా అధ్యక్షడి మాటలను పట్టించుకోకపోవడం గమనార్హం. ఈ వ్యవహారం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
ఇది కూడా చదవండి..: Satyashodhak School | గ్రామీణ ప్రాంతంలో విద్యా విప్లవం సత్యశోధక్ పాఠశాల.. 11న సిల్వర్ జూబ్లీ వేడుకలు!
