అక్షరటుడే, వెబ్డెస్క్ : CSR policy Telangana | కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) నిధుల సమీకరణతో పాటు వినియోగానికి ప్రత్యేక పాలసీ రూపొందించాలని సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) ఆదేశించారు. సీఎస్ఆర్ నిధులతో అభివృద్ధి, ప్రజోపయోగ కార్యక్రమాలు చేపట్టే సంస్థలను అభినందించాలని సూచించారు.
శాసనమండలి సమావేశ హాల్లో సీఎస్ఆర్ నిధులపై సీఎం సమీక్ష నిర్వహించారు. సీఎస్ఆర్ నిధులతో చేపడుతున్న కార్యక్రమాల వివరాలు, అన్ని ప్రభుత్వ విభాగాల్లో అందుబాటులో ఉన్న ప్రాజెక్టులపై చర్చించారు. ప్రతి ఏడాది అత్యుత్తమ భాగస్వామ్యం అందించిన సంస్థల ప్రతినిధులను అభినందించేందుకు ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో భాగంగా ఈ అభినందన కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాలన్నారు. రాష్ట్ర స్థాయిలో సీఎస్ఆర్ సెల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
CSR policy Telangana | పోర్టల్లో పెట్టాలి
ప్రభుత్వానికి, కార్పొరేట్ సంస్థలకు అనుసంధానంగా ఉండేలా ప్రత్యేకంగా సీఎస్ఆర్ పోర్టల్ రూపొందించాలని సీఎం సూచించారు. కార్పొరేట్ సంస్థలు సీఎస్ఆర్ విరాళాలను ఇచ్చేందుకు, వివిధ విభాగాల పరిధిలో చేపట్టేందుకు వీలున్న ప్రాజెక్టుల వివరాలన్నీ పోర్టల్లో అప్లోడ్ చేయాలన్నారు. సంస్థలు తమకు అనువైన ప్రాజెక్టులను ఎంచుకునేందుకు వీలుగా ఈ పోర్టల్ తయారు చేయాలని చెప్పారు.
దీనిని కూడా చదవండి : Kavitha Nizamabad visit | రేపు నిజామాబాద్కు కవిత.. పార్టీపై ప్రకటన చేస్తారా?

