అక్షరటుడే, వెబ్డెస్క్: Cyber fraud Hyderabad | మాజీ డీజీపీ మనవరాలికి సైబర్ నేరగాళ్లు టోకరా వేశారు. ఏకంగా రూ.1.20 కోట్లు కాజేశారు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు.
మాజీ డీజీపీ మనవరాలు హైదరాబాద్ (Hyderabad)లో వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ఆమె 18 కంపెనీలకు డైరెక్టర్గా ఉన్నారు. ఈ క్రమంలో సైబర్ నేరగాళ్లు ఆమె ఫొటో, పేరుతో ఫేక్ వాట్సాప్ అకౌంట్ క్రియేట్ చేశారు. అనంతరం తాను మీటింగ్లో ఉన్నానని, ఒక నంబర్ పంపారు. ఆ నంబర్కు రూ.1.20 కోట్లు ట్రాన్స్ఫర్ చేయాలని నిందితులు చెప్పారు. అయితే అకౌంటెంట్కు ఎలాంటి అనుమానం రాకపోవడంతో వెంటనే వారు చెప్పిన నంబర్కు డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు.
Cyber fraud Hyderabad | ఇలా బయటపడింది
సైబర్ నేరగాళ్లు మొదట ఈ నెల 13న రూ.1.20 కోట్లు ట్రాన్స్ఫర్ చేశారు. ఈ నెల 17న మరోసారి అలాగే మెసేజ్ పంపారు. దీంతో డబ్బులు పంపేముందు చెక్ అప్రూవల్ కోసం వ్యాపారవేత్తను అకౌంటెంట్ సంప్రదించడంతో అసలు విషయం బయట పడింది. తాను ఎవరికి డబ్బు పంపమని చెప్పలేదనడంతో అకౌంటెంట్ షాక్ అయ్యారు. గతంలో జరిగిన లావాదేవి గురించి చెప్పడంతో మోసపోయామని గ్రహించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Cyber fraud Hyderabad | ప్రత్యేక బృందాల ఏర్పాటు
ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మాజీ డీజీపీ (Former DGP) మనవరాలు కావడంతో పాటు ప్రముఖ పారిశ్రామికవేత్త కావడంతో నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. విచారణలో ప్రత్యేక బృందాలు కేరళ (Kerala)కు వెళ్లినట్లు తెలిసింది.
దీనిని కూడా చదవండి : Moinabad Drugs Case | డ్రగ్స్ కేసులో కీలక పరిణామం.. పైలట్ రోహిత్రెడ్డి ఫాంహౌస్ సీజ్

