అక్షరటుడే, వెబ్డెస్క్ : Cyber Fraud | సైబర్ నేరగాళ్లు ఏకంగా ఎమ్మెల్యేకు టోకరా వేశారు. ఆర్టీఏ చలాన్ పేరిట లింక్ పంపి ఖాతా ఖాళీ చేశారు. ఈ ఘటన ఆంధ్ర ప్రదేశ్లో చోటు చేసుకుంది.
దేశంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సామాన్యుల నుంచి మొదలు పెడితే వ్యాపారవేత్తల వరకు ఎవరిని వదలడం లేదు. పోలీసులు, రాజకీయ నాయకులు సైతం సైబర్ నేరాల బారిన పడుతున్నారు. ఇటీవల హైదరాబాద్ (Hyderabad)లో ఓ మహిళా వ్యాపారవేత్త నుంచి రూ.1.20 కోట్లు కాజేశారు. తాజాగా ఓ ఎమ్మెల్యే నుంచి రూ.12 లక్షలు కాజేశారు.
Cyber Fraud | లింక్ ఓపెన్ చేయడంతో..
ఏపీలోని పోలవరం ఎమ్మెల్యే (Polavaram MLA) చిర్రి బాలరాజు ఫోన్కు ఆర్టీఏ చలానా పేరుతో ఏపీకే ఫైల్ (APK File) వచ్చింది. ఎమ్మెల్యే తెలియక ఆ లింక్ను ఓపెన్ చేశారు. దీంతో ఆయన ఖాతాలో నుంచి సైబర్ నేరగాళ్లు రూ.12 లక్షలు మాయం చేశారు. దీంతో ఎమ్మెల్యే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. జీలుగుమిల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Cyber Fraud | అవగాహన కల్పిస్తున్నా..
దేశవ్యాప్తంగా ఇటీవల సైబర్ మోసాలు పెరిగాయి. పోలీసులు అవగాహన కల్పిస్తున్న ప్రజలు మోసపోతూనే ఉన్నారు. కొంతమంది అత్యాశకు పోయి సైబర్ నేరగాళ్ల బారిన పడుతుండగా.. మరికొందరు గుర్తు తెలియని లింక్లు ఓపెన్ చేసి ఖాతాలు ఖాళీ చేసుకుంటున్నారు. డిజిటల్ అరెస్ట్ (Digital Arrest) పేరిట సైబర్ దొంగలు భయపెడుతుండటంతో మరికొందరు డబ్బులు చెల్లిస్తున్నారు. ఇలాంటి మోసాలపై నిత్యం వార్తలు వస్తున్నాయి. పోలీసులు సైతం విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అయినా.. ప్రజలు సైబర్ నేరాల బారిన పడుతూనే ఉన్నారు.
దీనిని కూడా చదవండి : Cyber fraud Hyderabad | మాజీ డీజీపీ మనవరాలికి సైబర్ నేరగాళ్ల టోకరా

