అక్షరటుడే, వెబ్డెస్క్: Cyber Scam | సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సామాన్యుల నుంచి పెద్ద పెద్ద నేతలు, వ్యాపారవేత్తల వరకు ఎవరిని వదలడం లేదు. మాటలతో మాయ చేసి ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. తాజాగా ఓ ఎమ్మెల్యేను సైబర్ నేరగాళ్లు మోసం చేయడం గమనార్హం.
జనగామ ఎమ్మెల్యే (Jangaon MLA) పల్లా రాజేశ్వర్రెడ్డి సైబర్ దొంగల చేతిలో మోసపోయారు. సైబర్ నేరగాళ్లు ఎమ్మెల్యేకు ఫోన్ చేశారు. “వికసిత్ భారత్” పథకం కింద అర్హులకు రూ.10 లక్షల రుణం ఇప్పిస్తామని నమ్మించారు. అర్హుల జాబితా పంపించాలని సూచించారు. దీంతో నిజమేనని నమ్మిన ఎమ్మెల్యే జాబితా పంపారు.
Cyber Scam | ప్రాసెసింగ్ ఫీజు పేరిట..
రుణం కోసం ఒక్కొక్కరికి రూ.2,500 చొప్పున రూ. లక్ష ప్రాసెసింగ్ ఫీజు కట్టాలని సైబర్ నేరగాళ్లు (Cyber Criminals) చెప్పారు. దీంతో ఎమ్మెల్యే వారు చెప్పిన ఖాతాకు ఫోన్ పే ద్వారా డబ్బులు పంపించారు. మరోసారి నిందితులు డబ్బులు అడగడంతో ఎమ్మెల్యే రాజేశ్వర్రెడ్డికి అనుమానం వచ్చింది. విచారించగా.. ఇది సైబర్ నేరగాళ్ల మోసం అని తేలింది. దీంతో ఆయన వెంటనే వెంటనే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ (Jubilee Hills Police Station)లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు అవగాహన కల్పిస్తున్నా.. సైబర్ మోసాలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా చదువుకున్న వారు, వ్యాపారవేత్తలు, ఉద్యోగులు, రాజకీయ నాయకులు సైబర్ మోసాల బారిన పడుతుండటం గమనార్హం. చాలా వరకు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కేసులు ఉంటున్నాయి. తక్కువ కాలంలో ఎక్కువ ఆదాయం వస్తుందని నమ్మించి సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేస్తున్నారు. మరోవైపు డిజిటల్ అరెస్ట్ల పేరిట ఖాతాలు ఖాళీ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Youth Drug Awareness | యువత డ్రగ్స్కు దూరంగా ఉండాలి : మంత్రి రాజనర్సింహ
