అక్షరటుడే, హైదరాబాద్: Cyberabad Traffic Kindness | విధి నిర్వహణలో ఉన్న పోలీసుల మనసులో మానవత్వం ఎంత గొప్పదో చూపించే సంఘటన ఒకటి హైదరాబాద్లో చోటుచేసుకుంది. బాధలో ఉన్న ఓ వ్యక్తికి సహాయం చేసి అతనికి ఆత్మగౌరవం తిరిగి కలిగేలా చేసిన ట్రాఫిక్ పోలీసుల చర్య ప్రశంసలు అందుకుంటోంది.
Cyberabad Traffic Kindness | Madhapur ప్రాంతంలో..
వివరాల్లోకి వెళ్తే.. ముఖ్యమంత్రి బందోబస్తు విధుల్లో భాగంగా ఇన్స్పెక్టర్ ఆరె శ్రీధర్కుమార్ ఆధ్వర్యంలో విధులు నిర్వర్తిస్తున్న Cyberabad Traffic Police సిబ్బంది గ్రేటర్ హైదరాబాద్ నగరంలోని Madhapur ప్రాంతంలో ఉన్న ఎన్ఐఏ బస్ స్టాప్ వద్ద రోడ్డుపక్కన ఒక వ్యక్తి క్షీణ స్థితిలో పడిఉన్నట్టు గమనించారు. వెంటనే అతని వద్దకు వెళ్లి పరిస్థితిని తెలుసుకున్నారు.

ఆ వ్యక్తి తన పేరు గోపి అని చెప్పి, తాను చాలా ఆకలితో ఉన్నానని ట్రాఫిక్ పోలీసులకు తెలిపాడు. దీంతో అక్కడే ఉన్న సిబ్బంది వెంటనే అతనికి ఆహారం ఏర్పాటు చేశారు. సమోసాలు తీసుకువచ్చి అతనికి ఇచ్చి ఆకలి తీర్చారు.
ఇంతటితో ఆగకుండా మాధాపూర్ ట్రాఫిక్ సిబ్బంది అతనికి మరింత సహాయం చేశారు. అతనికి హెయిర్కట్, షేవింగ్ చేయించి శుభ్రంగా తయారు చేయించారు. దీంతో అతనికి తిరిగి ఆత్మగౌరవం, సౌకర్యం కలిగేలా చూసుకున్నారు.
ఈ ఘటనను Cyberabad Traffic Police తమ అధికారిక సోషల్ మీడియా వేదికలో పంచుకుంది. పోలీసుల ఈ చిన్న సహాయం సమాజంలో మానవత్వానికి మంచి ఉదాహరణగా నిలిచింది. సోషల్ మీడియాలో కూడా ఈ ఘటనపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. బాధలో ఉన్న వ్యక్తికి సహాయం చేసి మానవత్వాన్ని చాటిన ట్రాఫిక్ పోలీసులకు అభినందనలు తెలుపుతున్నారు.
🚓💙 Humanity in Uniform – A Small Act of Kindness
During the Hon’ble CM Bandobust duty today, near the NIA Bus Stop, traffic personnel noticed a man lying by the roadside in a distressed condition.
On speaking with him, he introduced himself as Gopi, and said he was hungry.… pic.twitter.com/pzzJZUYt4T
— Cyberabad Traffic Police (@CYBTRAFFIC) March 7, 2026

