అక్షరటుడే, వెబ్డెస్క్ : Damodar Rajanarsimha | రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తన కార్యాలయంలో ట్రాన్స్ ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ అండ్ టిష్యూస్ యాక్ట్ (THOTA) పాలసీ రూపకల్పనపై మంగళవారం సమీక్ష నిర్వహించారు. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అమలుపై ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలతో చర్చించారు.
అవయవ దానాలను ప్రోత్సహించేందుకు విధివిధానాలను సరళీకృతం చేయాలని మంత్రి రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. అవయవ మార్పిడి (Organ transplant) చికిత్సలో దేశంలో ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలిచేలా కార్యాచరణను రూపొందించాలన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో అవయవ మార్పిడి చికిత్సల ధరలపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్యులకు సైతం అవయవ మార్పిడి చికిత్సలకు అయ్యే ఖర్చును భరించే విధంగా ధరల నియంత్రణ ఉండాలని సూచించారు. దాతలు ఇచ్చిన అవయవాలు వృథా కాకుండా ప్రత్యేక చర్యలను చేపట్టాలని ఆదేశించారు.

Damodar Rajanarsimha | సహకారం అందిస్తాం
ఇతర దేశాల నుంచి ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం వచ్చే రోగుల కోసం నూతన విధివిధానాలను రూపొందించాలని మంత్రి ఆదేశించారు. ప్రైవేటు ఆస్పత్రుల (Private Hospitals) సమస్యలను తెలుసుకున్నారు. అవయవ మార్పిడి చికిత్సలకు అవసరమైన సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో చెయ్యి మార్పిడి చికిత్స కోసం నాలుగు ఆస్పత్రులకు అనుమతులు ఇచ్చామని తెలిపారు. సమావేశంలో వైద్యారోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తు, అధికారులు పాల్గొన్నారు.
దీనిని కూడా చదవండి : KTR on Six Guarantees | ఆరు గ్యారంటీలపై అసెంబ్లీలో నిలదీస్తాం : కేటీఆర్

