అక్షరటుడే, వెబ్డెస్క్: Danam Nagender Notices | ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆయనపై దాఖలైన అనర్హత పిటిషన్ను ఇటీవల స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Speaker Gaddam Prasad Kumar) కొట్టి వేసిన విషయం తెలిసిందే. స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.
మహేశ్వర్రెడ్డి పిటిషన్పై సోమవారం న్యాయస్థానం విచారణ చేపట్టింది. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా దానం పోటీ చేశారని మహేశ్వర్ రెడ్డి తరఫు న్యాయవాది వాదించారు. కర్ణాటక, బీహార్ రాష్ట్రాల్లో ఇలాంటి పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ఆయన ప్రస్తావించారు. కౌంటర్ దాఖలు చేయాలని అసెంబ్లీ కార్యదర్శి, దానం నాగేందర్కు హైకోర్టు నోటీసులు (High Court Notices) జారీ చేసింది. తదుపరి విచారణ ఏప్రిల్ 16కు వాయిదా వేసింది.
Danam Nagender Notices | ఆధారాలు లేవని..
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరారు. వారిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అనర్హత పిటిషన్లు వేశారు. స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో సుప్రీంకోర్టు (Supreme Court)ను ఆశ్రయించారు. వాటిపై నిర్ణయం తీసుకోవాలని కోర్టు ఆదేశించడంతో విచారణ చేపట్టిన స్పీకర్ అనర్హత పిటిషన్లను కొట్టి వేస్తూ తీర్పు చెప్పారు. వాళ్లు పార్టీ మారినట్లు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. ఎమ్మెల్యేల జీతం నుంచి బీఆర్ఎస్ పార్టీ ఫండ్ కట్ అవుతుందని, వారు బీఆర్ఎస్లోనే ఉన్నారని పేర్కొన్నారు.
Danam Nagender Notices | కోర్టు ఎం చెబుతుందో..
పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారగా.. అందరి అనర్హత పిటిషన్లను స్పీకర్ డిస్మిస్ చేశారు. అయితే ఇందులో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం ఆయన కాంగ్రెస్లో చేరి ఆ పార్టీ టికెట్పై ఎంపీగా పోటీ చేశారు. కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తి పార్టీ మారినట్లు ఆధారాలు లేవని స్పీకర్ చెప్పడం గమనార్హం. ఈ క్రమంలోనే స్పీకర్ నిర్ణయంపై బీజేపీ ఎమ్మెల్యే (BJP MLA) హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఎలాంటి తీర్పు చెబుతుంతో చూడాలి.
ఇది కూడా చదవండి..: Fee Reimbursement Protest | ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని బీఆర్ఎస్ నిరసన

