అక్షరటుడే, వెబ్డెస్క్: Delhi CCTV Removal | ఢిల్లీ ప్రభుత్వం (Delhi Government) కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలో అమర్చిన లక్షకు పైగా సీసీ కెమెరాలను తొలగించనుంది. జాతీయ భద్రతకు ముప్పు పొంచి ఉందని వీటిని తీసి వేస్తున్నట్లు తెలిపింది.
ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) హయాంలో నగరవ్యాప్తంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. చైనాలో తయారైన 1.4 లక్షల సీసీ కెమెరాలను అమర్చారు. వీటిని దశలవారీగా తొలగించే ప్రక్రియను ఢిల్లీ ప్రజా పనుల శాఖ మంత్రి పర్వేష్ సాహిబ్ సింగ్ బుధవారం ప్రారంభించారు. ఢిల్లీలో రెండు దశల్లో మొత్తం 2,74,389 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. 2020 సెప్టెంబర్ నుంచి 2022 నవంబర్ వరకు 1.40 లక్షల కెమెరాలను అమర్చారు. 2025 జూన్ నుంచి 2026 మార్చి వరకు 1,34,389 కెమెరాలు ఏర్పాటు చేశారు.
Delhi CCTV Removal | చైనా కంపెనీకి చెందినవి
మొదటి దశలోని ఏర్పాటు చేసిన కెమెరాలు అన్ని చైనా కంపెనీ హిక్విజన్కు చెందినవి. ఇది ప్రపంచవ్యాప్తంగా భద్రతాపరమైన ఆందోళనలను రేకెత్తించింది. మంత్రి పర్వేష్ సాహిబ్ సింగ్ (Minister Parvesh Sahib Singh) మాట్లాడుతూ, ఢిల్లీ అంతటా చైనాకు చెందిన హిక్విజన్ కెమెరాలను ఏర్పాటు చేసేటప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) దీర్ఘకాలిక భద్రతా పరిణామాలను పరిగణనలోకి తీసుకోలేదన్నారు. నిఘా అనేది కేవలం ప్రదర్శన కోసం పెట్టే విషయం కాదని, ఇది సున్నితమైన డేటా నియంత్రణకు సంబంధించిన సమస్య అన్నారు. ఇది జాతీయ భద్రతను ప్రభావితం చేస్తుందని తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఈ విషయం తీవ్రతను అర్థం చేసుకోవడంలో విఫలమైందని విమర్శించారు.
Delhi CCTV Removal | సురక్షితమైన వాటితో భర్తీ
అధిక డేటా భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండే ఆధునిక, సురక్షితమైన సాంకేతికంగా ఉన్నతమైన వ్యవస్థలతో కెమెరాలను దశలవారీగా భర్తీ చేస్తామని మంత్రి తెలిపారు. నిఘాకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు ఈ ప్రక్రియను దశలవారీగా నిర్వహిస్తామని వెల్లడించారు. మొదటి దశలో 50 వేల చైనా కెమెరాలను మార్చడానికి ఆమోదం లభించింది.
ఇది కూడా చదవండి..: Assam Uniform Civil Code | ఉమ్మడి పౌరస్మృతి అమలు చేస్తాం.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
