అక్షరటుడే, వెబ్డెస్క్ : Delhi Liquor Scam Case | ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు (Delhi Liquor Scam Case)ను రౌస్ అవెన్యూ కోర్టు (Rouse Avenue Court) కొట్టివేసిన విషయం తెలిసిందే. మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha) సహా 23 మందికి న్యాయస్థానం క్లీన్చిట్ ఇచ్చింది. అయితే దీనిపై సీబీఐ ఢిల్లీ హైకోర్టు (Delhi High Court)ను ఆశ్రయించింది.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో 23 మంది నిందితులను విడుదల చేస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన నిర్ణయాన్ని సవాలు సీబీఐ పిటిషన్ వేసింది. అవినీతి నిరోధక చట్టం కింద ప్రత్యేక న్యాయమూర్తి జితేంద్ర సింగ్ నిందితులపై ప్రారంభించిన కేసును కొట్టివేశారు. ఆరోపణలకు తగిన ఆధారాలు, సాక్ష్యాలు లేవని కోర్టు పేర్కొంది. ఎక్సైజ్ పాలసీలో ఎటువంటి విస్తృత కుట్ర, నేరపూరిత ఉద్దేశం లేదని తీర్పు చెప్పింది.
Delhi Liquor Scam Case | సీబీఐకి మందలింపు
సీబీఐ (CBI) ఊహ ఆధారంగా కుట్ర కథనాన్ని నిర్మించడానికి ప్రయత్నించినందున ప్రాసిక్యూషన్ కేసు న్యాయ పరిశీలన నుంచి బయటపడలేదని ప్రత్యేక కోర్టు తెలిపింది. 23 మంది నిందితులలో ఎవరిపైనా ప్రాథమికంగా ఎటువంటి కేసు నమోదు కాలేదని పేర్కొంది. అప్రూవర్ స్టేట్మెంట్ల ద్వారా కేసును నిర్మించినందుకు ప్రత్యేక కోర్టు సీబీఐని మందలించింది.
Delhi Liquor Scam Case | రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే..
ఇలాంటి ప్రవర్తనకు అనుమతిస్తే రాజ్యాంగ సూత్రాలను తీవ్రంగా ఉల్లంఘించడమే అవుతుందని న్యాయమూర్తి అభిప్రాయ పడ్డారు. నిందితుడికి క్షమాభిక్ష పెట్టి, ఆ తర్వాత అప్రూవర్గా చేయడం, దర్యాప్తులో ఉన్న ఖాళీలను పూరించడానికి, అదనపు వ్యక్తులను నిందితులుగా చేయడానికి అతని ప్రకటనలు ఉపయోగించడం తప్పు అని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఈ కేసులో ప్రభుత్వ ఉద్యోగిని (కుల్దీప్ సింగ్) నంబర్ వన్ నిందితుడిగా చేసిన సీబీఐ అధికారులపై విచారణకు సిఫార్సు చేస్తామని కోర్టు తెలిపింది.
పరిగణనలోకి తీసుకోకపోవడంతో..
లిక్కర్ పాలసీ కేసులో సీబీఐ వాదనలను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సీబీఐ ఢిల్లీ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది. కోర్టు అభియోగాల రూపకల్పన స్థాయిలో విస్మరించబడిన, పరిగణించబడని అనేక అంశాలను ఏజెన్సీ గుర్తించిందని వర్గాలు తెలిపాయి. దర్యాప్తులోని అనేక అంశాలను విస్మరించడం, తగినంతగా పరిగణించకపోవడంతో ట్రయల్ కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా తక్షణమే హైకోర్టులో అప్పీల్ చేయాలని సీబీఐ నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు.

