హైదరాబాద్: గత రెండు దశాబ్దాలుగా క్రికెట్ ప్రపంచంలో ‘నంబర్ 7’ అంటే కేవలం ఒక అంకె కాదు, అది ఎంఎస్ ధోనీకి ఒక బ్రాండ్ ఇమేజ్. అయితే, గత కొన్ని రోజులుగా ధోనీ ‘నంబర్ 8’ గురించి చేస్తున్న సోషల్ మీడియా పోస్ట్లు అందరినీ అయోమయంలో పడేశాయి. ధోనీ తన జెర్సీ నంబర్ మారుస్తున్నారా? లేక కొత్త ఇన్నింగ్స్ మొదలుపెడుతున్నారా? అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్న తరుణంలో అసలు విషయం బయటపడింది. దేశవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న నిద్రలేమి సమస్యపై పోరాడేందుకు ‘ది స్లీప్ కంపెనీ’ బ్రాండ్ అంబాసిడర్గా ధోనీ బాధ్యతలు చేపట్టారు.
ఏమిటీ ‘ఇండియా వర్సెస్ పీస్ఫుల్ స్లీప్’ ఉద్యమం?
భారతదేశం ప్రస్తుతం ఒక నిశ్శబ్ద ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప్రపంచంలో అత్యధికంగా నిద్రలేమితో బాధపడుతున్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో, ధోనీ తన జెర్సీ నంబర్ 7 నుండి 8 గంటల ప్రశాంత నిద్రను సూచించే ‘నంబర్ 8’ వైపు మళ్లారు. కేవలం మంచం మీద గడపడం నిద్ర కాదని, క్వాలిటీతో కూడిన 8 గంటల విశ్రాంతి శరీరానికి అవసరమని ఈ “ఇండియా వర్సెస్ పీస్ఫుల్ స్లీప్” ప్రచారం చెబుతోంది.
ధోనీ మాటల్లో..
ఈ భాగస్వామ్యంపై ఎంఎస్ ధోనీ స్పందిస్తూ, “మైదానంలో నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి నేను ఎంత కష్టపడతానో, రోజు ముగిశాక నేను అంతే విలువనిచ్చే విషయం ప్రశాంతమైన నిద్ర. 8 గంటల నిద్ర మనిషి పనితీరులో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుంది. అందుకే ఈ ఆరోగ్యకరమైన అలవాటును ప్రజల్లోకి తీసుకెళ్లడానికి నేను ‘ది స్లీప్ కంపెనీ’తో చేతులు కలిపాను” అని పేర్కొన్నారు.
మంచం మీద గంటలు గడుపుతున్నా నిద్ర ఎందుకు రావట్లేదు?
ఈ ప్రచారంలో భాగంగా విడుదలైన డిజిటల్ వీడియోలో ఒక ప్రాముఖ్యమైన పాయింట్ను చర్చించారు. చాలా మంది పడకపై ఎక్కువ సమయం గడుపుతున్నా, నిరంతరం అటూ ఇటూ దొర్లడం, నడుము నొప్పి, అసౌకర్యమైన భంగిమల వల్ల సరైన నిద్రను పొందలేకపోతున్నారు. దీనివల్ల మరుసటి రోజు వారి పనితీరు దెబ్బతింటోంది. ఈ సమస్యను పరిష్కరించడానికి ‘ది స్లీప్ కంపెనీ’ తమ పేటెంట్ పొందిన SmartGRID® టెక్నాలజీని పరిచయం చేసింది. ఇది శరీర ఆకృతికి తగ్గట్టుగా మారుతూ నడుముకు మంచి సపోర్ట్ ఇస్తుంది.
ప్రియాంక హర్షిల్ సలోట్ (సహ వ్యవస్థాపకులు) మాట్లాడుతూ.. “భారతీయుల నిద్ర అలవాట్లను మార్చాలంటే దేశం మొత్తం నమ్మే ఒక వ్యక్తి కావాలి, అందుకే ధోనీని ఎంచుకున్నాం. ఇది కేవలం అడ్వర్టైజ్మెంట్ కాదు, ప్రతి ఇంట్లో 8 గంటల నిద్రను ఒక రూల్ లాగా మార్చాలనేదే మా లక్ష్యం.”
ప్రియా పర్దివాలా (చీఫ్ క్రియేటివ్ ఆఫీసర్) మాట్లాడుతూ.. “ఒక స్టేడియం స్థాయిలో నిద్ర కోసం జరిగే సంఘర్షణను చూపించడం ద్వారా ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలని ఈ కథను రూపొందించాం.”
నిత్యం పనులతో బిజీగా ఉండే భారతీయులు తమ ఆరోగ్యం కోసం 8 గంటల ప్రశాంత నిద్రను ఒక ‘నాన్-నెగోషియబుల్’ (రాజీ పడని) అంశంగా మార్చుకోవాలని ఈ ఉద్యమం పిలుపునిస్తోంది. ధోనీ లాంటి లెజెండ్ ఈ విషయాన్ని చెప్పడం వల్ల ఖచ్చితంగా ప్రజల్లో మార్పు వస్తుందని ఆశిద్దాం.

