అక్షరటుడే, వెబ్డెస్క్ : Double Bedroom Houses | అసంపూర్తిగా నిలిచిపోయిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి (Ponguleti Srinivas Reddy) కీలక ప్రకటన చేశారు. త్వరలో వాటి నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. అసెంబ్లీలో బుధవారం ఆయన మాట్లాడారు.
బీఆర్ఎస్ (BRS) హయాంలో రెండు లక్షల పైచిలుకు ఇండ్లను మంజూరు చేసి జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలో లక్ష ఇళ్లను కేటాయించిందన్నారు. వాటిలో 78,861 ఇళ్లు పూర్తయినా.. మౌలిక సదుపాయాలకు నోచుకోలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రూ.738 కోట్ల నిధులతో మౌలిక వసతులను కల్పించి 26 వేళ ఇళ్ల నిర్మాణం పూర్తి చేశామన్నారు. 2 బీహెచ్కే కాలనీల్లోని షాపులను బహిరంగ వేలంలో విక్రయించి వచ్చిన డబ్బును ఆయా కాలనీ కమిటీ ప్రతినిధి, ప్రభుత్వం ప్రతినిధి పేరిట జాయింట్గా జమ చేశామన్నారు. వాటిపై వచ్చే వడ్డీతో విద్యుత్, లిఫ్ట్ తదితర అవసరాలుకు ఖర్చు చేసేలా ఆదేశించామని చెప్పారు.
Double Bedroom Houses | లబ్ధిదారులకే నిధులు
అసంపూర్తిగా మిగిలిపోయిన డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం పూర్తి చేయడానికి పాత కాంట్రాక్టర్లు అప్పటి రేటుకు సమ్మతిస్తే వారికి పనులు అప్పగిస్తామని మంత్రి తెలిపరాఉ. 99రోజల ప్రణాళికా కార్యక్రమంలో లబ్దిదారుల ఎంపిక పూర్తి చేసి మిగిలిన నిర్మాణాలు పూర్తి చేసుకుంటాం అంటే లబ్దిదారులకే నిధులు ఇస్తామని ప్రకటించారు.
Double Bedroom Houses | సర్పంచ్లే కీలకం
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో సర్పంచులే కీలకమని మంత్రి తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ఇందిరమ్మ కమిటీలకు సర్పంచులే అధ్యక్షులుగా ఉంటారన్నారు. కేవలం అర్హతే ప్రామాణికంగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందన్నారు. భవిష్యత్తులో ఎమ్మెల్యేలకు ప్రాతినిధ్యం కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
దీనిని కూడా చదవండి : Kavitha New Party | కవిత కొత్త పార్టీకి ముహూర్తం ఖరారు..! మార్చి 27న ప్రకటించే ఛాన్స్..

