అక్షరటుడే, వెబ్డెస్క్ : E Cigarette Racket | హైదరాబాద్ (Hyderabad) నగరంలో ఈ సిగరెట్ల గుట్టును పోలీసులు రట్టు చేశారు. నాంపల్లి బజార్ఘాట్లో దాడులు చేశారు. రూ.34 లక్షలు విలువ చేసే నిషేధిత ఈ-సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు మహ్మద్ అహ్మద్, మహ్మద్ అస్జద్ రజా, వినీత్ మంత్రిని అరెస్ట్ చేశారు.
నిషేధిత ఎలక్ట్రానిక్ సిగరెట్ల అక్రమ విక్రయాలపై పోలీసులు దృష్టి పెట్టారు. నాంపల్లి పోలీసుల (Nampally Police) సహకారంతో టాస్క్ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. రూ.34.03 లక్షల విలువైన 999 ఎలక్ట్రానిక్ సిగరెట్లు (వేప్లు)తో పాటు ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
E Cigarette Racket | వల పన్ని..
విశ్వసనీయ సమాచారం మేరకు నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బజర్ఘాట్లోని ‘ఎ’ బ్యాటరీ లైన్ సమీపంలో పోలీసు బృందాలు వల పన్ని నిందితులను పట్టుకున్నాయి. ఆపరేషన్లో సేల్స్మెన్ మహమ్మద్ అహ్మద్ (36), వెల్డర్ మహమ్మద్ అస్జాద్ రజా అలియాస్ అర్హాన్ (30) అనే ఇద్దరు వ్యక్తులు దొరికారు. అహ్మద్ ద్విచక్ర వాహనంపై 180 నిషేధిత ఇ-సిగరెట్లను డెలివరీ చేయడానికి ప్రయత్నిస్తుండగా పట్టుబడగా, వాటిని స్వీకరించిన వ్యక్తిగా రజాను గుర్తించారు. మూడో నిందితుడైన వినీత్ మంత్రి ఆదేశాల మేరకు ఈ లావాదేవీ జరుగుతోందని పోలీసులు తెలిపారు.
E Cigarette Racket | అత్తాపూర్లో..
అరెస్ట్ అయిన ఇద్దరిని విచారించగా.. ప్రధాన సూత్రధారి వినీత్ మంత్రి (33) అని తెలిపారు. అతడిని అత్తాపూర్లోని నివాసంలో గుర్తించారు. అదుపులోకి తీసుకుని, అతని వద్ద నుంచి భారీ మొత్తంలో నిషేధిత ఎలక్ట్రానిక్ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు.
E Cigarette Racket | వాట్సాప్ ద్వారా..
నిందితులు ఈ సిగరెట్లు డెలివరీ చేయడానికి వాట్సాప్, టెలిగ్రామ్ వినియోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మంత్రి, రజాలు వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా ఈ దందాను నడిపారని పేర్కొన్నారు. అక్కడ వారు స్టాక్ అప్డేట్లను పంచుకుంటూ, కస్టమర్లతో అమ్మకాలను సమన్వయం చేసుకున్నారని వెల్లడించారు. ఆన్లైన్లోనే చెల్లింపులు స్వీకరించేవారు. నిషేధిత సరుకును పంపిణీ చేయడానికి నిందితులు రాపిడో (Rapdio), పోర్టర్ వంటి డెలివరీ సేవలను సైతం ఉపయోగించడం గమనార్హం. నిందితులు ఢిల్లీకి చెందిన అంకిత్ అనే వ్యక్తి నుంచి భారీ మొత్తంలో ఈ-సిగరెట్లను కొనుగోలు చేశారని పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి : Rotten meat storage | కోల్డ్ స్టోరేజీ నిండా కుళ్లిన మాంసం.. షాకైన అధికారులు
