అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Education Budget Demand | విద్యా రంగానికి 20 శాతం బడ్జెట్ కేటాయించాలని టీపీటీఎఫ్(tptf protest) జిల్లా అధ్యక్షుడు వెనిగళ్ల సురేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద నిరసన తెలిపారు. అనంతరం కలెక్టరేట్ కార్యాలయ అధికారికి మెమోరాండం అందజేశారు.
Education Budget Demand | రెండున్నరేళ్లుగా ఉపాధ్యాయులపై వివక్ష..
టీపీటీఎఫ్, ఉపాధ్యాయ సంఘాల ఐక్య కూటమి (USPC), ఇతర ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు జేఏసీగా ఏర్పడి ఉపాధ్యాయుల సమస్యలపై రెండున్నరేళ్లుగా అనేక సార్లు వినతి పత్రాలు ఇచ్చామన్నారు. అయినప్పటికీ ప్రభుత్వంలో చలనం లేకుండా పోయిందన్నారు. నామమాత్రపు హామీలు, ప్రకటనలతోనే రెండున్నరేళ్లు గడిచిపోయిందని వివరించారు. ఒక డీఎస్సీ ద్వారా కొద్దిమేర మెరుగైన స్టాఫ్ పాటర్న్ రావడం, 25,000 మందికి పదోన్నతులు రావడం ఆహ్వానించదగిందే కానీ.. ఈ రెండు తప్ప మెజారిటీ టీచర్లకు ఎలాంటి ప్రయోజనం జరగలేదన్నారు. మోడల్ స్కూల్లో పనిచేస్తున్న టీచర్లకు హెల్త్ కార్డులు ఇవ్వలేదని.. పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చినట్లుగా సీపీఎస్ రద్దు చేయలేదని.. ఓపీఎస్ తీసుకురాలేదని చెప్పారు.
Education Budget Demand | పీఆర్సీ నివేదిక గుడువు పెంచుకుంటూ..
పాత ప్రభుత్వం వేసిన పీఆర్సీ నివేదిక గడువు పెంచుకుంటూ పోవడమే తప్ప ఫలితం లేదని వెనిగల్ల సురేష్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రస్థాయి నాయకత్వాలు రిటైర్ అవుతున్నా.. కొత్త నాయకులు వస్తున్నా.. జాతీయ ధరల సూచిక ప్రకారం జీవన వ్యయం పెరుగుతున్నా నేటికి పీఆర్సీ ప్రస్తావన చేయకపోవడం అన్యాయమన్నారు. బడ్జెట్ ప్రసంగంలో(budget allocation) కనీసం ఒక హామీపై కూడా మాట్లాడక పోవడం సరికాదన్నారు.
ఉపాధ్యాయులను అవమానించడమే..
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ ప్రకటన రాగానే గత పీఆర్సీ(PRC) సూత్రం ప్రకారం రెండున్నరేళ్లుగా(public protest) చెల్లించాల్సిన 5 డీఏలు (కరవుభత్యం) చెల్లించక పోవడం ఉపాధ్యాయులను అవమానించడమేనని సురేష్ అన్నారు. గోరు చుట్టపై రోకటి పోటులా ఆకునూరి మురళి కమిటీ ఇచ్చిన రిపోర్ట్లో మన జీతాలు మార్కెట్తో పోల్చినప్పుడు ఎక్కువగా ఉన్నాయనడం వారి బాధ్యతారాహిత్యానికి తార్కాణమన్నారు. ఇంతకీ ఏ మార్కెట్ జీతాలతో పోల్చారో వారికే తెలియాలని.. మన జీతాలను(nizamabad news) ప్రైవేట్ టీచర్ల జీతాలతో పోల్చి వారి శ్రమ దోపిడీని ప్రామాణికం చేస్తూ ఆకునూరి మురళి కమిటీ తిరోగమన దిశగా ఆలోచించడం ఆక్షేపనీయని ఆయన పేర్కొన్నారు. లక్షల కోట్లను అనేక పథకాల పేరుతో సివిల్ కాంట్రాక్ట్ల కోసం కేటాయించే ప్రభుత్వం మన డీఏలు, పెన్షనర్ల ఆర్థిక చెల్లింపులు, జీపీఎఫ్, టీఎస్జీఎల్ఐ, మెచ్యూరిటీ సొమ్ము, పీఆర్సీ బకాయిలు చెల్లించడంలో ఖజానా సొమ్మంతా గత ప్రభుత్వం చేసిన అప్పులకే పోతుందని బీద పలుకులు పలకడం నమ్మ శక్యంగా లేదన్నారు.
బడ్జెట్లో అరకొర నిధులు..
పాలక వర్గ పార్టీ ప్రభుత్వంలోకి రాక ముందు విద్యా రంగానికి 15శాతం కేటాయిస్తామని మాట ఇచ్చి (india education) నేటికి మూడో బడ్జెట్లో కూడా 8.23శాతం శాతానికి దాటలేదని టీపీటీఎఫ్ అధ్యక్షుడు విమర్శించారు. వైఈఈఆర్ఎస్, టీపీఎస్, టీఎఫ్ఎస్ (YIIRS, TPS, TFS)ల పేరుతో కొత్త పాఠశాలలు స్థాపన కోసం ప్రణాళికలు చేస్తూ కేటాయింపులు చేయకపోవడం విడ్డూరమని.. కేజీబీవీ ఉపాధ్యాయులకు రెగ్యులర్ స్కేల్ ఇవ్వాలని సీపీఎస్ను వెంటనే రద్దు చేయాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. రెగ్యులర్ ఎంఈవోలను భర్తీ చేసి పదోన్నతులు పూర్తి చేయాలని రెసిడెన్షియల్ పాఠశాలలో పనివేళలు టైం టేబుల్ను సవరించాలని కోరారు. కార్యక్రమంలో టీపీటీఎఫ్ ప్రధాన కార్యదర్శి అర్వింద్, వెంకట్, నరేందర్, చల్లా సత్యనారాయణ, మోహన్, మహేష్, అప్పారావు, కస్తూరి నరేష్, ప్రవీణ్, శిరీష, పేట నాయకులు నాంచారి శ్రీనివాస్, గోపిరెడ్డి మురళి, మహిళ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Registration Server Issue | రాష్ట్రంలో నిలిచిన రిజిస్ట్రేషన్లు

