అక్షరటుడే, కామారెడ్డి: Electric Pole Hazard | పట్టణంలోని ప్రధాన రోడ్లపై విద్యుత్స్తంభాలు వాహనదారులను భయపెడుతున్నాయి. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతాల్లో రోడ్లపై ఉన్న స్తంభాలను విద్యుత్శాఖ అధికారులు పట్టించుకోవట్లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Electric Pole Hazard | నిజాంసాగర్ రోడ్డులో..
కామారెడ్డి పట్టణంలోని (kamareddy news) నిజాంసాగర్ చౌరస్తా నుంచి జీవదాన్ పాఠశాల (Jeevadhan School) వెళ్లే దారిలో ఓ భారీ భవనంలో సూపర్ మార్కెట్, ఓ ప్రైవేటు పాఠశాల కొనసాగుతున్నాయి. ఆ పక్కనే మరో స్కూల్ (school zone risk) కూడా ఉంది. అలాగే కొద్ది దూరం ముందుకు వెళ్తే మూడు అపార్టుమెంట్లు ఉన్నాయి. వీటన్నిటికి వెళ్లే దారి సూపర్ మార్కెట్, లయోలా పాఠశాల మధ్యలో ఉంది. అయితే ప్రధాన రహదారికి ఆనుకుని పాఠశాలకు వెళ్లే దారిలో అటు ఇటువైపుగా సిమెంట్ విద్యుత్ స్తంభాలు ఉన్నాయి. రోడ్డు మధ్యలో మాత్రం ఇనుప విద్యుత్ స్తంభం ప్రమాదకరంగా మారింది.
Electric Pole Hazard | స్కూల్ బస్సులు అదే దారిలో..
పాఠశాలలకు విద్యార్థులను తీసుకెళ్లేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు కార్లు, బైక్లపై వెళ్తుండగా రద్దీ ఏర్పడుతోంది. మధ్యలో విద్యుత్ స్థంభం ఉండడంతో రహదారి ఇరుకుగా మారుతోంది. అలాగే పాఠశాలలకు సంబంధించిన బస్సులు సైతం అదే దారిలో (traffic issues) వెళ్తుంటాయి. ఆ సమయంలో విద్యుత్ స్థంభానికి పక్క నుంచే ప్రమాదకరంగా వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు సూపర్ మార్కెట్ పక్కనే ఉన్న విద్యుత్ స్తంభానికి, దారిలో ఇనుప విద్యుత్ స్తంభానికి మధ్యలో నుంచి వెళ్ల డానికి కూడా అవకాశం లేదు. సిమెంట్ స్తంభం, ఇనుప స్తంభం మధ్యలో సపోర్ట్ వైరు ఉండడం కూడా ప్రమాదకరంగా మారుతోంది. ఈ క్రమంలో అనుకోని ఘటన జరిగితే ఎవరూ ఉహించలేని ప్రమాదం సంభవించే అవకాశం ఉంది.
అయినప్పటికీ విద్యుత్ అధికారులు (Kamareddy Transco) మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఆ దారి ప్రమాదకరంగా ఉందని పాఠశాలల యాజమాన్యాలు కూడా ఫిర్యాదు చేసిన దాఖలాలు కనిపించడం లేదు. ప్రమాదం జరిగాక బాధపడకుండా ముందస్తు జాగ్రత్తగా ప్రమాదకరంగా మారిన విద్యుత్ లైన్ను సరిచేయాలని స్థానికులు కోరుతున్నారు. మరి అధికారులు స్పందిస్తారో లేదో చూడాలి.

ఇది కూడా చదవండి: Iran US Conflict | దాడులు చేస్తే ఊరుకోం.. ట్రంప్కు ఇరాన్ వార్నింగ్
