అక్షరటుడే, కామారెడ్డి: Electricity Workers Protest | ఒకే పనికి రెండు సర్వీస్ రూల్స్ వర్తింపజేయడం బాధాకరమని విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల జేఏసీ ఉమ్మడి జిల్లా కన్వీనర్ హరికృష్ణ అన్నారు. కామారెడ్డి విద్యుత్ సర్కిల్ కార్యాలయం (Kamareddy Electricity Circle Office) వద్ద గురువారం వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. తమ సమస్యలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శించారు.
Electricity Workers Protest | కార్యాలయంలోనే వంటావార్పు..
కార్యాలయ ఆవరణలోనే వంటలు చేసుకుని అక్కడే భోజనం చేసి కార్మికులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ.. బ్రిటిష్ కాలం నాటి సర్వీస్ రూల్స్ తొలగించాలని, ఏపీఎస్బీ కన్వర్షన్ చేయాలన్నారు. ఈ రెండు సాధించుకోవడం తమ హక్కు అని పేర్కొన్నారు. చేసే పని ఒకటే అయినప్పుడు విద్యార్హతల ప్రకారం కన్వర్షన్ ఇవ్వాలని, ఏపీఎస్బీ రూల్స్ అమలు చేయాలన్నారు. అన్మ్యాన్డ్ కార్మికులు (Unmanned Workers) 1600 మందిని కూడా ఆర్టిజన్లుగా గుర్తించాలన్నారు. పీస్వైర్ కార్మికులకు కూడా జీవో 11 ప్రకారం సమాన పనికి సమాన వేతనం కల్పించాలని కోరారు. స్టోర్ కార్మికులు, పీస్వైర్ కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించాలన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను యాజమాన్యం పట్టించుకుని తమను చర్చలకు పిలిచి తమ హక్కులను కల్పించాలని కోరారు.
Electricity Workers Protest | గుర్తించినా రెగ్యులరైజ్ చేయలేదు..
గత బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Government) తమను ఆర్టిజన్లుగా గుర్తించింది కానీ రెగ్యులరైజ్ చేయలేదని.. ప్రభుత్వం ఏర్పడకముందు పాదయాత్రలో తమను రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తిస్తామని హామీ ఇచ్చారని హరికృష్ణ గుర్తు చేశారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ భీంరాజ్, కామారెడ్డి డివిజన్ జేఏసీ ఛైర్మన్ సునీల్ గౌడ్, కన్వీనర్ రంజిత్ యాదవ్, స్వామి, కామారెడ్డి జిల్లా కన్వీనర్ జయసింహ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కిష్టాగౌడ్, జాయింట్ సెక్రెటరీ రాఘవచారి, శ్యామ్ గౌడ్, బాన్సువాడ డివిజన్ ఛైర్మన్ కృష్ణ, కన్వీనర్ రాజేందర్, బాలరాజు, దత్తు, ఎల్లారెడ్డి డివిజన్ ఛైర్మన్ రాజేందర్, కన్వీనర్ రాజగౌడ్, విజయ్ కుమార్, ప్రవీణ్ కుమార్ అన్మ్యాన్డ్ కార్మికులు నరేష్, నితిన్, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Palle Pragathi Participation | పల్లె ప్రగతిలో అందరూ భాగస్వాములు కావాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి
