అక్షరటుడే,ఎల్లారెడ్డి: Electricity Workers Strike | విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారం కోసం(artisan workers demand) సమ్మె బాట పట్టనున్నారు. ఈ మేరకు (టీవీఏఈ జేఏసీ) (TVAEJAC) తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సమ్మె సైరన్ మోగనున్నట్లు తెలుస్తోంది..
Electricity Workers Strike | కామారెడ్డిలో జిల్లాస్థాయి సమావేశం
కామారెడ్డి జిల్లా స్థాయి సమావేశం సోమవారం ఎల్లారెడ్డి(Yellareddy) డివిజన్లో నిర్వహించారు. సమావేశంలో ఆర్టిజన్ కార్మికులకు(telangana power employees) కన్వర్షన్ అమలు చేయడం, ఏపీ ఎస్ఈబీ నిబంధనలు వర్తింపజేయడం, టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో(tgnpdcl news) పనిచేస్తున్న అన్మ్యాండ్ కార్మికులను టీజీ ఎస్పీడీసీఎల్ తరహాలో ఆర్టిజన్ కార్మికులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఈ అంశాలపై సమ్మె నోటీసు జారీ చేసినట్లు నాయకులు తెలిపారు.
Electricity Workers Strike | కార్మికుల హక్కుల సాధన..
హక్కుల సాధన కోసం చేపట్టే సమ్మెను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా (labor protest india) కార్మికులు పిలుపునిచ్చారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం(employee union protest) వెంటనే స్పందించాలని కోరారు. ఈ సమావేశంలో టీజీ ఎన్పీడీసీఎల్ కంపెనీ కన్వీనర్ హెచ్. శ్రీకాంత్, కామారెడ్డి జిల్లా ఛైర్మన్ బి.హరికృష్ణ, కో-ఛైర్మన్ భీమ్రాజ్, కో-కన్వీనర్ బి. నివర్తి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ. కిష్టాగౌడ్, జాయింట్ సెక్రటరీ ఏ రాఘవాచారి, ఎల్లారెడ్డి డివిజన్ ఛైర్మన్ టి.రాజేందర్, కన్వీనర్ ఎం రాజాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి : Nizamabad Railway Projects | రైల్వే ప్రాజెక్టులపై త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాలి: ఎంపీ అర్వింద్

