అక్షరటుడే, వెబ్డెస్క్: Encroachment Drive | హైదరాబాద్ (Hyderabad) నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కరించడానికి అధికారులు ఫుట్పాత్లపై ఆక్రమణలు తొలగిస్తున్నారు. ప్రతి శనివారం స్పెషల్ డ్రైవ్ చేపట్టి ఫుట్పాత్లపై అక్రమంగా నిర్మించిన షెడ్లు, నిర్వహిస్తున్న వ్యాపారాలను తొలగిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం సైతం పలు చోట్ల తొలగింపులు చేపట్టగా.. ఉద్రిక్తత చోటు చేసుకుంది.
సికింద్రాబాద్ -మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్రిక్తత నెలకొంది. ఫుట్పాత్, రోడ్డుపై ఉన్న షాపులు కూల్చివేయడానికి జీహెచ్ఎంసీ అధికారులు (GHMC Officers), పోలీసులు పెద్ద ఎత్తున వచ్చారు. కూల్చివేతలను నిరసిస్తూ వ్యాపారులు అధికారులతో వాగ్వాదం చేశారు. జేసీబీలకు అడ్డంగా పడుకున్నారు. కొందరు జేసీబీ డ్రైవర్లపై దాడి చేశారు. దీంతో జీహెచ్ఎంసీ సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం వ్యాపారులు పోలీస్ స్టేషన్ని ముట్టడించి ఆందోళన చేశారు.
Encroachment Drive | ఆరాంఘర్లో..
రాజేంద్రనగర్ సర్కిల్ (Rajendranagar Circle) పరిధిలోని ఆరాంఘర్లో ఫుట్పాత్లపై షాపులను అధికారులు తొలగిస్తున్నారు. ముందస్తు సమాచారం లేకుండా కూల్చివేతలు చేపడుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి. కేపీహెచ్బీ (KPHB)లో సైతం ఆక్రమణలను అధికారులు తొలగించారు. MRO ఆఫీస్కి వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న ఆక్రమణలను జేసీబీతో తీసేశారరు. ఫుట్పాత్లు, రోడ్లను ఆక్రమించి వ్యాపారాలు చేస్తుండటంతో ట్రాఫిక్కు అంతరాయం కలుగుతోంది. దీంతో అధికారులు చర్యలు చేపట్టారు.
ఇది కూడా చదవండి..: WhatsApp Impersonation Fraud | బడా కంపెనీలే లక్ష్యంగా సైబర్ నేరగాళ్ల మోసం
