అక్షరటుడే, వెబ్డెస్క్ : Excise Constable Transfers | రాష్ట్రవ్యాప్తంగా ఎక్సైజ్ కానిస్టేబుళ్ల బదిలీలు వారంలో పూర్తి చేస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. గంజాయి ముఠా చేతిలో గాయపడి మృతి చెందిన కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ రిటైర్డ్ ఉద్యోగులు ఆర్థిక చేయూత అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు.
Excise Constable Transfers | ఒక రోజు పెన్షన్ విరాళం
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఇటీవల ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యను గంజాయి ముఠా కారుతో ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. బాధిత కుటుంబానికి ప్రభుత్వం రూ.కోటి పరిహారం అందిస్తామని ప్రకటించింది. అలాగే సౌమ్య సోదరుడికి ఉద్యోగం కూడా ఇచ్చింది. అయితే తాజాగా ఎక్సైజ్ రిటైర్డ్ ఉద్యోగులు వారి ఒక్క రోజు పెన్షన్ను సౌమ్య కుటుంబానికి విరాళం అందించారు. రూ.2.80 లక్షల చెక్కును మంత్రి జూపల్లి కృష్ణారావు డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో సౌమ్య కుటుంబ సభ్యులకు అందజేశారు.
Excise Constable Transfers | డ్రగ్స్పై కఠిన చర్యలు
మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. వారంలోగా సుమారు 2,500 మంది ఎక్సైజ్ కానిస్టేబుళ్ల బదిలీలు పూర్తి చేస్తామని వెల్లడించారు. సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం ఇప్పటికే రూ.కోటి ఆర్థిక సాయం, ఆమె సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించినట్టు గుర్తుచేశారు. మాదకద్రవ్యాలు, అక్రమ మద్యంపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కుమ్మెర జాతర ఘటనపై మంత్రి విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామన్నారు. రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి నూతన విధానంతో వాటర్ స్పోర్ట్స్, ఎకో, వెల్నెస్ టూరిజంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

ఇది కూడా చదవండి.. : Kavitha Delhi Liquor Case | నిజం గెలిచింది : కల్వకుంట్ల కవిత
కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ రిటైర్డ్ ఉద్యోగుల అండ
విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ తమ ఒకరోజు పెన్షన్ విరాళంగా అందించింది. రూ.2.80 లక్షల చెక్కును మంత్రి జూపల్లి కృష్ణారావు డా.బీఆర్ అంబేద్కర్… pic.twitter.com/Y44YXteIbl
— IPRDepartment (@IPRTelangana) February 27, 2026

