అక్షరటుడే, హైదరాబాద్: Face Recognition Schemes | సంక్షేమ పథకాల అమలులో పారదర్శకతను పెంచే దిశగా తెలంగాణ ముఖ్యమంత్రి Revanth Reddy కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రభుత్వ పథకాలను ఫేస్ రికగ్నిషన్ విధానానికి అనుసంధానం చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
Face Recognition Schemes | అన్ని పథకాలకు ఫేస్ రికగ్నిషన్ తప్పనిసరి
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రేషన్, పెన్షన్లు Pension , విద్య, రైతు, మహిళా సంక్షేమ పథకాల్లో లబ్ధిదారుల గుర్తింపును ఫేస్ రికగ్నిషన్తో ధ్రువీకరించాలనే దిశగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ విధానం ద్వారా నకిలీలు, రెండుసార్లు నమోదు, మోసపూరిత వినియోగం వంటివి అరికట్టవచ్చని సర్కారు భావిస్తోంది.
Face Recognition Schemes | పారదర్శకత – లక్ష్యంగా ప్రభుత్వం
ప్రస్తుతం ఆధార్ ఆధారంగా ధ్రువీకరణ కొనసాగుతోంది. కానీ, మరింత కచ్చితత్వం కోసం ముఖ గుర్తింపు సాంకేతికతను ఉపయోగించాలని సర్కారు నిర్ణయించింది. ఈ విధానం అమల్లోకి వస్తే.. లబ్ధిదారులు ప్రత్యక్షంగా ముఖ గుర్తింపును నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. తద్వారా మధ్యవర్తుల జోక్యం తగ్గుతుంది. అర్హులకు మాత్రమే ప్రయోజనాలు కలుగుతాయి.
Face Recognition Schemes | కలెక్టర్లకు ప్రత్యేక ఆదేశాలు
జిల్లా స్థాయిలో అవసరమైన టెక్నాలజీ సౌకర్యాలు, పరికరాలు, సిబ్బందికి శిక్షణ వంటి అంశాలకు కావల్సిన ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్లకు సూచించినట్లు సమాచారం. గ్రామ సచివాలయాలు, మీసేవ కేంద్రాల్లో ఫేస్ రికగ్నిషన్ వ్యవస్థలను అందుబాటులోకి తీసుకురానున్నారు.
అమలు విధానం
మొదట కొన్ని పథకాలు ఎంపిక చేసి, పైలట్ ప్రాజెక్ట్గా అమలు చేస్తారు. విజయవంతం అయితే దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. లబ్ధిదారులకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా ప్రచారం నిర్వహించనున్నారు.
ప్రజల్లో చర్చ
సర్కారు నిర్ణయంపై ప్రజల్లో ఇప్పటికే చర్చ మొదలైంది. పారదర్శకతకు ఈ విధానం దోహదం చేస్తుందని కొందరు చెబుతుండగా.. మరోవైపు సాంకేతిక లోపాలు, వృద్ధులు, కార్మిక వర్గాలకు ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

