అక్షరటుడే, ఇందూరు: Field Visits by Officers | మండల ప్రత్యేక అధికారులు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో సందర్శించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. జిల్లా కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణి (Prajavani) అనంతరం అధికారులతో సమావేశం నిర్వహించారు.
Field Visits by Officers | ప్రతిఒక్క అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి..
ఈ సందర్భంగా కలెక్టర్ (Collector Ila Tripathi) మాట్లాడుతూ.. బాలికల గురుకుల పాఠశాలలను సందర్శించే సమయంలో వారి ఆరోగ్యం సామాజిక సమస్యలు, మానసికమైన ఒత్తిడి తదితర అంశాలను తెలుసుకోవాలని ఆదేశించారు. బాలికల భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నారా లేదా అని పరిశీలించాలన్నారు. ఏప్రిల్ 1వ తేదీ నాటికి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఈ-ఆఫీసులుగా మారాల్సిందేనని కలెక్టర్ స్పష్టం చేశారు. పరిపాలనాపరమైన అనుమతులు, ఆర్థిక లావాదేవీలు అన్ని ఆన్లైన్ విధానంలోనే జరగాలని ఆదేశించారు.

Field Visits by Officers | ఆపరేటర్లకు శిక్షణ ఇవ్వాలి..
అవసరమైతే ఆపరేటర్లకు శిక్షణ ఇవ్వాలని ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ కార్తీకి సూచించారు. అలాగే ఏప్రిల్ 2న జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామపంచాయతీలో గ్రామసభలు, మున్సిపల్ పట్టణాల్లో వార్డు సభలు విధిగా నిర్వహించాలని చెప్పారు. వేసవికాలాన్ని దృష్టిలో పెట్టుకొని 8 గంటలకు సభలు ప్రారంభమయ్యేలా చూడాలని, షామియానా, తాగునీటి సదుపాయం అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పంట రుణ మాఫీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, సన్న బియ్యం పంపిణీ, కొత్త రేషన్ కార్డుల జారీ, పెన్షన్ మంజూరు, మహాలక్ష్మి పథకం అమలు తదితర వివరాలను సభల్లో వెల్లడించాలని తెలిపారు. సమావేశంలో సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియా, ఇన్ఛార్జి అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, డీఆర్డీవో సాయాగౌడ్, ఆర్డీవో రాజేంద్ర కుమార్, బోధన్ ఏసీపీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Fake Land Documents | ఫేక్ డాక్యుమెంట్లతో కబ్జాకు యత్నం.. ప్రజావాణిలో బాధితుడి ఫిర్యాదు

