అక్షరటుడే, వెబ్డెస్క్ : Gajwel Political Tension | సిద్దిపేట (Siddipet) జిల్లా గజ్వేల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. సీఎం క్యాంప్ ఆఫీస్లో కాంగ్రెస్ నాయకులు పెట్టిన సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) ఫొటోను బీఆర్ఎస్ నాయకులు తొలగించారు.
గజ్వేల్లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్పై శనివారం ఉదయం దాడి జరిగిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున క్యాంపు కార్యాలయానికి తరలి వచ్చాయి. కార్యాలయంలో మాజీ సీఎం, ఎమ్మెల్యే కేసీఆర్ ఫొటోను తొలగించి సీఎం రేవంత్రెడ్డి ఫొటోను నాయకులు పెట్టారు. ఈ సందర్భంగా క్యాంపు కార్యాలయంపై దాడి చోటు చేసుకుంది. క్యాంప్ ఆఫీస్లోని కిటికీ అద్దాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.
Gajwel Political Tension | కేసీఆర్ ఫొటో ఏర్పాటు
క్యాంప్ ఆఫీస్పై తాము దాడి చేయలేదని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అయితే అధికార పార్టీ నేతలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ దాడికి పాల్పడ్డారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు ఈ దాడిని ఖండించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు గజ్వేల్ బీఆర్ఎస్ నాయకులు ఒంటేరు ప్రతాప్రెడ్డి ఆధ్వర్యంలో క్యాంప్ ఆఫీస్కు ర్యాలీగా వెళ్లారు. కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఫొటో తొలగించి కేసీఆర్ ఫొటో (KCR Photo) ఏర్పాటు చేశారు. క్యాంప్ ఆఫీస్పై దాడి చేసిన కాంగ్రెస్ నేతలపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గజ్వేల్ కేసీఆర్ క్యాంప్ ఆఫీసులో పెట్టిన రేవంత్ రెడ్డి ఫోటో తొలగించిన బీఆర్ఎస్ సీనియర్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి 🔥🔥 pic.twitter.com/p398t3PAud
— 𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨 (@Nallabalu1) April 4, 2026
ఇది కూడా చదవండి : WhatsApp Impersonation Fraud | బడా కంపెనీలే లక్ష్యంగా సైబర్ నేరగాళ్ల మోసం
