అక్షరటుడే, కామారెడ్డి: Gandhari Mandal | భార్యపై భర్త హత్యాయత్నం చేయగా.. అతడికి ఐదేళ్ల జైలుశిక్ష విధిస్తూ కామారెడ్డి కోర్టు(District Court Verdict) తీర్పునిచ్చింది. ఈ మేరకు శుక్రవారం పోలీసులు వివరాలు వెల్లడించారు.
Gandhari Mandal | గాంధారి మండలం మర్లకుంట..
గాంధారి మండలం(Gandhari Mandal) మర్లకుంట గ్రామానికి చెందిన బాధావత్ స్వాతిని మాచారెడ్డి మండల కేంద్రానికి చెందిన విస్లావత్ లచ్చిరాంకు పన్నెండేళ్ల క్రితం వివాహం జరిపించారు. వీరికి ఒక కూతురు కూడా ఉంది. అయితే లచ్చిరాం తాగుడుకు బానిసై స్వాతిని అదనపు కట్నం(Dowry Harassment) కోసం మానసికంగా, శారీరకంగా వేధిస్తుండటంతో విసుగెత్తిన ఆమె తండ్రి పలుమార్లు కులపెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టారు. అయినా వినకపోవడంతో స్వాతిని తండ్రి తన ఇంటికి తీసుకెళ్లాడు.
Gandhari Mandal | కత్తితో దాడి చేయగా..
2022 ఫిబ్రవరి 26న స్వాతి టైలరింగ్ నిమిత్తం గాంధారికి వెళ్లగా లచ్చిరాం గాంధారికి బైక్పై వచ్చి కత్తితో ఆమెపై దాడి చేశాడు. దీంతో స్వాతి చేతికి గాయమైంది. ఈ విషయమై పోలీసులకు (Telangana Crime News) ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ కేసులో 2025 మే 21న కామారెడ్డి అసిస్టెంట్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి సుమలత నిందితునికి ఐదేళ్ల జైలు శిక్ష, రూ.5వేల జరిమానా విధించారు. అనంతరం నిందితుడు జిల్లా కోర్టులో అప్పీల్కు వెళ్లగా శుక్రవారం జిల్లా న్యాయమూర్తి వర ప్రసాద్ విచారణ అనంతరం నిందితుడికి అసిస్టెంట్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి సుమలత ఇచ్చిన తీర్పు సరైనదేనని తీర్పునిచ్చారు.

ఇది కూడా చదవండి: RDO Parthasarathi Reddy | ఆర్డీవో పార్థసింహారెడ్డి సేవలు అభినందనీయం

