అక్షరటుడే, వెబ్డెస్క్:Gas Cylinder Theft | పశ్చిమాసియాలో ఉద్రిక్తలతో దేశంలో గ్యాస్ కొరత నెలకొంది. దీంతో కేంద్ర ప్రభుత్వం (Central Government) వాణిజ్య సిలిండర్ల సరఫరాపై ఆంక్షలు విధించింది. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలో పెద్ద ఎత్తున సిలిండర్లు చోరీకి గురయ్యాయి. ఈ ఘటన ఇటీవల చోటు చేసుకుంది.
ఝాన్సీలో 524 గ్యాస్ సిలిండర్లతో BPCL ప్లాంట్ నుంచి కాన్పూర్కు బయల్దేరిన ట్రక్కును దుండగులు ఎత్తుకెళ్లారు. రూ.18 లక్షల విలువైన లోడ్తో వెళ్తుండగా.. లారీని అడ్డగించిన లారీతో పరారు అయ్యారు. ఖాళీ ట్రక్కును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు, కానీ సిలిండర్లు (Cylinders) మిస్టరీగానే ఉన్నాయి.

Gas Cylinder Theft | కేసు నమోదు
ట్రక్ యజమాని నీరజ్ అగర్వాల్ 524 నిండిన LPG సిలిండర్లను తీసుకెళ్తున్న తన ట్రక్కు దొంగిలించబడిందని ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నారు. మార్చి 2న ప్లాంట్ నుండి 524 గ్యాస్ సిలిండర్లతో కాన్పూర్ దేహత్లోని గజ్నర్కు ట్రక్కును లోడ్ చేశారు. అనంతరం పోలీసులు ఖాళీ లారీని గుర్తించారు. అయితే సిలిండర్లు ఎవరు ఎత్తుకెళ్లారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు
Gas Cylinder Theft | భారీగా బారులు
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని అనేక జిల్లాల్లో ప్రజలు గ్యాస్ కొరతతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రాంపూర్, వారణాసి, నోయిడా, ఝాన్సీలో వినియోగదారులు గ్యాస్ పొందడానికి భారీగా బారులు తీరారు. రాంపూర్ జిల్లాలోని గ్యాస్ వినియోగదారులు సకాలంలో గ్యాస్ సిలిండర్లు అందుబాటులో లేకపోవడం, పెరుగుతున్న ధరల కారణంగా సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే రాంపూర్లో సిలిండర్ల కొరత లేదని అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి..: LPG Shortage Impact | చమురు మంట.. మొబైల్, ఇంటర్నెట్పై ఎఫెక్ట్ పడనుందా!

