అక్షరటుడే, హైదరాబాద్ : GHMC Property Tax Dues | హైదరాబాద్ (Hyderabad) లో సంవత్సరాలుగా పేరుకుపోయిన ఆస్తి పన్ను బకాయిలపై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) కఠిన చర్యలు చేపట్టింది. పన్నులు చెల్లించకుండా కాలయాపన చేస్తున్న సంస్థలు, వాణిజ్య సంస్థలపై చర్యలు చేపడుతూ అధికారులు దూకుడుగా ముందుకెళ్తున్నారు.
ఖైరతాబాద్లోని కత్రియా హోటల్ను జీహెచ్ఎంసీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ హోటల్పై 2017 నుంచి పెండింగులో సుమారు ₹6.16 కోట్ల ఆస్తి పన్ను బకాయిలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

GHMC Property Tax Dues | ఇదిలా ఉండగా పలు ఇతర సంస్థల నుంచి కూడా భారీ బకాయిలు రావాల్సి ఉన్నట్లు గుర్తించారు:
- నాంపల్లి లోని ఔరోరా కాలేజ్పై 2016 నుంచి ₹1.28 కోట్ల బకాయి
- గోషామహల్లోని సర్ణా ట్రాన్స్పోర్ట్పై 2016 నుంచి ₹43.78 లక్షలు
- గోషామహల్లోని సోనీ సెంటర్పై 2018 నుంచి ₹39.68 లక్షలు
- బంజారాహిల్స్లోని షమీమ్ సుల్తానా క్లాత్ మాల్పై 2014 నుంచి ₹35.27 లక్షలు
- నాగార్జున సర్కిల్లోని సింఫోసిస్ బిజినెస్ సొల్యూషన్స్పై 2012 నుంచి ₹17.94 లక్షలు
ఈ బకాయిల వసూళ్ల కోసం జీహెచ్ఎంసీ ఇప్పటికే వారెంట్లు జారీ చేసింది. అవసరమైనచోట్ల స్వాధీనం చర్యలు తీసుకుంటోంది.
అదే సమయంలో, సికింద్రాబాద్ అమీరపేట్ సర్కిల్ పరిధిలోని బెల్సన్ తాజ్ హోటల్కు వారెంట్ జారీ చేసిన వెంటనే యాజమాన్యం స్పందించి, ఒకేసారి ₹33,52,774 బకాయిని వన్ టైమ్ సెటిల్మెంట్ (OTS) కింద చెల్లించింది.
పన్ను బకాయిల విషయంలో ఎటువంటి రాజీ ఉండదని, చెల్లింపులు చేయని సంస్థలపై కఠిన చర్యలు కొనసాగుతాయని జీహెచ్ఎంసీ అధికారులు స్పష్టం చేశారు. నగర అభివృద్ధికి అవసరమైన నిధులు సమకూర్చేందుకు పన్ను చెల్లింపులు తప్పనిసరి అని ప్రజలకు సూచించారు.
ఇది కూడా చదవండి..: Hyderabad Pollution Free | కాలుష్య రహితంగా హైదరాబాద్ : సీఎం రేవంత్రెడ్డి

