అక్షరటుడే, వెబ్డెస్క్: Gold Price Surge | కొంతకాలంగా ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న జియో పొలిటికల్ టెన్షన్స్, అమెరికా అధ్యక్షుడు అనుసరిస్తున్న ఆర్థిక విధానాలతో ఈక్విటీ మార్కెట్లు కుదేలవుతున్నాయి. పెట్టుబడిదారులు భారీగా నష్టపోతున్నారు.
ఈ నేపథ్యంలో చాలామంది సురక్షిత పెట్టుబడులుగా భావించే బంగారం, వెండి వంటి లోహాలలో పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో వీటి ధరలకు ఇప్పటికే రెక్కలొచ్చాయి. ఏడాదిన్నర కాలంలో బంగారం ధర (Gold Price) మూడింతలవగా.. వెండి నాలుగింతలు పెరిగింది. ఇటీవలి కాలంలో ధరలు కాస్త శాంతించి, కాస్త ఊరటనిచ్చాయి.
Gold Price Surge | మళ్లీ రెక్కలు!
మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు పెరిగాయి. ఇజ్రాయిల్, అమెరికా (America) సంయుక్తంగా శనివారం ఇరాన్పై దాడులు చేపట్టాయి. ఇరాన్ సైతం దీటుగా స్పందిస్తుండడంతో పరిస్థితి ఎక్కడికి దారితీస్తుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయనే ఆందోళనతో పెట్టుబడిదారులు రక్షణాత్మక ఆస్తుల వైపు మొగ్గు చూపే అవకాశాలున్నాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియాలో బంగారం, వెండి ఫ్యూచర్స్ ధరలు గణనీయంగా పెరిగాయి.
Gold Price Surge | జియో పొలిటికల్ టెన్షన్స్
ఏప్రిల్ డెలివరీ గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాముల ధర రూ.1,60,399 వద్ద ట్రేడ్ అవగా.. మార్చి డెలివరీ సిల్వర్ ఫ్యూచర్స్ కిలోకు సుమారు రూ.2,67,600కు చేరింది. స్పాట్ బులియన్ మార్కెట్లో ధరలు షాకిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh), తెలంగాణ (Telangana)లలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు 1,64,500 దాటింది. వెండి ధర కిలోకు 10 వేలపైనే పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో కేజీ స్వచ్ఛమైన వెండి ధర తిరిగి రూ.3 లక్షలు దాటడం గమనార్హం. జియో పొలిటికల్ టెన్షన్స్ పెరుగుతున్న ప్రతిసారి బంగారం ధరలకు రెక్కలొస్తున్నాయి. ఇజ్రాయిల్, ఇరాన్ల మధ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చితే ధరలు మరింత భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయన్న అభిప్రాయాన్ని అనలిస్టులు వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Gold Silver Prices | స్థిరంగా బంగారం, వెండి ధరలు.. రానున్న రోజులలో పెరిగే ఛాన్స్..!

