అక్షరటుడే, హైదరాబాద్: Gold Silver Prices | దేశంలో గత రెండు మూడు రోజులుగా బంగారం, వెండి ధరలలో Silver Prices పెద్దగా మార్పుల్లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. గురువారం ఒక్కసారిగా రూ.870 మేర పెరిగిన బంగారం ధర, శుక్రవారం సుమారు రూ.500 వరకు తగ్గింది. ప్రస్తుతం మార్కెట్లో స్వల్ప హెచ్చుతగ్గులు మాత్రమే కనిపిస్తున్నాయి.
Gold Silver Prices | బులియన్ మార్కెట్లో..
గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం, ఫిబ్రవరి 28 శనివారం ఉదయం 6.30 గంటల సమయానికి హైదరాబాద్ Hyderabad బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,61,580గా నమోదైంది. అదే సమయంలో 22 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర రూ.1,48,110గా ఉంది. వెండి ధరలు కూడా స్థిరంగానే కొనసాగుతున్నాయి. హైదరాబాద్లో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.2,94,900గా ఉంది.
Gold Silver Prices | ప్రధాన నగరాల్లో..
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములు) ఎలా ఉన్నాయనేది చూస్తే..
- చెన్నైలో 24 క్యారెట్ బంగారం ధర రూ.1,62,540 కాగా – 22 క్యారెట్ ధర రూ.1,48,990గా ఉంది.
- ముంబైలో 24 క్యారెట్ ధర రూ.1,61,580 – 22 క్యారెట్ ధర రూ.1,48,110గా నమోదైంది.
- ఢిల్లీలో 24 క్యారెట్ రూ.1,61,710 – 22 క్యారెట్ రూ.1,48,240గా ఉంది.
- కోల్కతాలో 24 క్యారెట్ రూ.1,61,580 – 22 క్యారెట్ రూ.1,48,110గా ఉంది.
- బెంగళూరులో 24 క్యారెట్ రూ.1,61,580 – 22 క్యారెట్ రూ.1,48,110గా కొనసాగుతోంది.
- విజయవాడలో 24 క్యారెట్ రూ.1,61,580 – 22 క్యారెట్ రూ.1,48,110గా ఉంది.
- కేరళలో 24 క్యారెట్ రూ.1,61,580 – 22 క్యారెట్ రూ.1,48,110గా ఉంది. ఫుణెలో 24 క్యారెట్ రూ.1,61,580 – 22 క్యారెట్ రూ.1,48,110గా నమోదైంది.
- వడోదరలో 24 క్యారెట్ బంగారం ధర రూ.1,61,610 కాగా – 22 క్యారెట్ ధర రూ.1,48,140గా ఉంది.
- అహ్మదాబాద్లో 24 క్యారెట్ రూ.1,61,610 – 22 క్యారెట్ రూ.1,48,140గా కొనసాగుతోంది.
వెండి ధరల విషయానికి వస్తే కిలో వెండి ధర చెన్నైలో Chennai రూ.2,94,900గా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్కతా, బెంగళూరు, ఫుణె, వడోదర, అహ్మదాబాద్ నగరాల్లో కిలో వెండి ధర రూ.2,84,900గా నమోదైంది. ఇక హైదరాబాద్, విజయాడ, కేరళలో కిలో వెండి ధర రూ.2,94,900గా కొనసాగుతోంది.
Gold Silver Prices | దీర్ఘకాలంలో..
ప్రస్తుతం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో బంగారం Gold, వెండి ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా అమెరికా వాణిజ్య విధానంలో అనిశ్చితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్లలో ఒత్తిడి వంటి అంశాలు ఇన్వెస్టర్లను సురక్షిత పెట్టుబడిగా బంగారం వైపు మళ్లిస్తున్నాయి. పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో డిమాండ్ పెరిగితే ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

