అక్షరటుడే, ఎల్లారెడ్డి: Government Hospital Deliveries | ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవాలు జరిగేలా వైద్యులు చర్యలు తీసుకోవాలని వైద్యాధికారి డాక్టర్ రవీందర్ గౌడ్ అన్నారు. నిజాంసాగర్ (Nizamsagar), పిట్లం, జుక్కల్ ప్రభుత్వ ఆస్పత్రులను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Government Hospital Deliveries | సిబ్బంది హాజరు.. పనితీరు..
సిబ్బంది హాజరు, గర్భిణుల నమోదు, ప్రభుత్వ ఆస్పత్రి (Government Hospital)లో జరిగిన ఆరోగ్య పరీక్షలు ప్రసవాల గురించి స్థానిక వైద్యాధికారి డాక్టర్ రోహిత్ కుమార్ను అడిగి తెలుసుకున్నారు. వైద్యులు, వైద్యసిబ్బంది సమయపాలన పాటించాలని సూచించారు. విధులపై నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. 14 ఏళ్లు నిండిన బాలికలకు హెచ్పీవీ వ్యాక్సిన్లు అందించాలని తెలిపారు. వ్యాక్సిన్ తీసుకున్న పలువురికి ఆయన ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. ఆస్పత్రిలో సానిటేషన్ సక్రమంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా వైద్య సదుపాయాలు అందించాలని పేర్కొన్నారు. ఆయన వెంట డీసీహెచ్ఎస్ విజయ్ కుమార్, డిప్యూటీ డీఎంహెచ్వో శోభ, వైద్యులు, సిబ్బంది ఉన్నారు.
ఇది కూడా చదవండి..: Ayyappa Idol Procession | భక్తిశ్రద్ధలతో అయ్యప్ప స్వామి మూలవిరాట్ ఊరేగింపు

