అక్షరటుడే, వెబ్డెస్క్ : Gulf Telugu Advisory | పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆయా దేశాల్లో ఉన్న తెలుగు వారంతా అప్రమత్తంగా, క్షేమంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సూచించారు. తెలంగాణ నుంచి లక్షలాది మంది బతుకు దెరువు కోసం గల్ఫ్ దేశాల్లో ఉంటున్నారు. అయితే ఆయా దేశాలపై ఇరాన్ దాడులు చేస్తుండటంతో సీఎం కీలక సూచనలు చేశారు.
యుద్ధ వాతావరణం, పలు దేశాల విమానాశ్రయాలను మూసి వేసిన నేపథ్యంలో ఇరాన్, దుబాయ్ తదితర దేశాల్లో చిక్కుకున్న తెలుగు వారు ఆయా ప్రాంతాల దౌత్య కార్యాలయాల మార్గదర్శకాలను పాటించాలని సీఎం సూచించారు. తెలంగాణ ప్రజల భద్రత రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని, ఈ అత్యవసర పరిస్థితులపై ఎప్పటికప్పుడు కేంద్రంతో సమన్వయం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Gulf Telugu Advisory | భారత్కు తరలించాలి
గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న భారతీయుల భద్రత కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. భారతీయుల రక్షణ, భద్రత కోసం తీసుకుంటున్న చర్యలను, పరిస్థితులను దౌత్య కార్యాలయాల ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని, అక్కడ చిక్కుకున్న వారిని భారత్కు తరలించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Gulf Telugu Advisory | ఆయిల్ ట్యాంకర్పై ఇరాన్ దాడి
ఒమన్ (Oman)లో ఆయిల్ ట్యాంకర్లపై ఇరాన్ దాడులు చేసింది. దాడి సమయంలో ఆయిల్ ట్యాంకర్లో పలువురు భారతీయులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో నలుగురికి గాయాలు అయ్యాయి. హర్మూజ్ జలసంధిలో ఉన్న ఆయిల్ ట్యాంకర్పై ఇరాన్ దాడి చేసింది.
విమానాలు రద్దు
ఢిల్లీ ఎయిర్పోర్టు (Delhi Airport)లో 100కు పైగా విమానాలు రద్దు అయ్యియి. ఇరాన్, ఇజ్రాయెల్ గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఆయా దేశాలకు వెళ్లాల్సిన విమానాలు నిలిచిపోయాయి. ఢిల్లీ నుంచి వెళ్లాల్సిన 60, ఢిల్లీకి రావాల్సిన 40 విమానాలు రద్దు అయినట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీలో పాటు ముంబై, దేశంలోని ఇతర ఎయిర్ పోర్టుల నుంచి సైతం విమానాలు రద్దు అయ్యాయి.

ఇది కూడా చదవండి : Iran Dubai Doha Attacks | దుబాయ్, దోహాలపై ఇరాన్ దాడులు.. ఆందోళనకరంగా పరిస్థితి

