అక్షరటుడే, ఆర్మూర్: Gurukul Students Field Trip | పట్టణంలోని గురుకుల డిగ్రీ మహిళా కళాశాల (Gurukul students) విద్యార్థులు ఫీల్డ్ ట్రిప్లో భాగంగా వరంగల్ (Warangal) పట్టణాన్ని సందర్శించారని (field trip Warangal) ప్రిన్సిపల్ చంద్రిక తెలిపారు. కళాశాలలోని బీఏ (హెచ్ఈసీ) విద్యార్థులు, అధ్యాపకులు వి.సులోచన, కె.సుష్మ, సంధ్య వాణి వైస్ ప్రిన్సిపాల్ సుజాత ఆధ్వర్యంలో విద్యార్థులు తరలివెళ్లారు.
Gurukul Students Field Trip | చారిత్రక కట్టడాల సందర్శన
క్షేత్ర పర్యటనలో భాగంగా గురువారం వరంగల్లోని కాకతీయుల (Kakatiya history) కాలం నాటి తెలంగాణ చారిత్రక కట్టడాలైన రామప్ప దేవాలయం (Ramappa Temple), కాకతీయులు కోట, కళా తోరణం, భద్రకాళి ఆలయం (Bhadrakali Temple), ఖుష్ మహల్, పర్యాటక ప్రదేశం లక్నవరం వంతెనను (Laknavaram Bridge) సందర్శించారు. తెలంగాణలోని (Telangana News) ములుగు జిల్లా పాలంపేటలో ఉన్న చారిత్రక రామప్ప దేవాలయానికి (రుద్రేశ్వరాలయం) 2021లో యునెస్కో (UNESCO) ప్రపంచ వారసత్వ ప్రదేశం హోదా లభించిందని వైస్ ప్రిన్సిపాల్ విద్యార్థులకు వివరించారు. ఈ ఆలయ నిర్మాణ శైలి, సాంకేతికత అయోధ్య రామ మందిర నిర్మాణానికి ప్రధాన స్ఫూర్తిగా నిలిచాయని ఆమె పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి : Fee Regulation | ఫీజు నియంత్రణ చట్టం వెంటనే తీసుకురావాలి..: కవిత
