అక్షరటుడే, వెబ్డెస్క్: Half Day Schools | తెలంగాణలో ఎండలు భగభగ మండుతున్నాయి. మార్చి తొలి వారంలోనే సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల చేరువలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ (Telangana Education Department) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలల్లో ఈ నెల 15 నుంచి ఒంటి పూట బడులు నిర్వహించనుంది. ఇందుకు సంబంధించిన ఆదేశాలు జారీ చేసింది.
Half Day Schools | ఏప్రిల్ 23 వ తేదీ వరకు
మార్చి 15న ప్రారంభం కానున్న ఒంటిపూట బడులు ఏప్రిల్ 23వ తేదీ వరకు కొనసాగనున్నట్లు విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ గురువారం ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలలు ప్రతి రోజూ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు నడవనున్నాయి. ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు మధ్యాహ్నం 12:30 గంటలకు మధ్యాహ్న భోజనం అందించనున్నారు.
Half Day Schools | పదో తరగతి సెంటర్లు ఉన్న స్కూళ్లలో..
రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు మార్చి 14వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే సెంటర్లు ఉన్న పాఠశాలలు పరీక్షలు జరిగే రోజులలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేయనున్నాయి. ఉత్తర్వులను తప్పనిసరిగా అమలు చేయాలని డీఈవోలను (DEO) ఆదేశించారు.
ఇది కూడా చదవండి..: Gas Cylinder Booking | గ్యాస్ సిలిండర్ బుకింగ్ గడువు 45 రోజులకు పెంపు

