అక్షరటుడే, బాన్సువాడ: Hanuman Maha Mandala Puja | పట్టణంలోని జ్ఞాన సరస్వతి దేవి (Jnana Saraswati Temple) ఆలయ ప్రాంగణంలో హనుమాన్ దీక్ష పీఠాధిపతులు దుర్గాప్రసాద్ స్వామిజీ ఆధ్వర్యంలో సామూహిక మహా మండల పూజ నిర్వహించారు. అష్టోత్తర శతకుండాత్మక (108) సుందరకాండ పారాయణంతో (Sundarakanda Parayanam) కూడిన 162వ హనుమాన్ మహాయజ్ఞం భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా జరిపించారు.
Hanuman Maha Mandala Puja | ఎమ్మెల్యే పోచారం కుటుంబీకులు..
మహాయజ్ఞంలో (Banswada Temple Event) ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి (Mla Pocharam Srinivas reddy) కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఆయనతో పాటు పోచారం శంభు రెడ్డి, ప్రేమల దంపతులు, మాజీ డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పీఠాధిపతులు దుర్గా ప్రసాద్ స్వామిజీ నేతృత్వంలో జరిగిన ఈ మహా మండలపూజలో వేద మంత్రోచ్చరణల మధ్య సుందరకాండ పారాయణం, హోమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
Hanuman Maha Mandala Puja | యజ్ఞశాలలో..
యజ్ఞశాలలో అష్టోత్తర శతకుండాలతో నిర్వహించిన హోమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. హనుమాన్ దీక్ష ద్వారా ఆధ్యాత్మిక శక్తి, (Telangana News) మనోబలం పెరుగుతాయని, సమాజంలో ఐక్యత, శాంతి నెలకొల్పడంలో ఇలాంటి యజ్ఞాలు(Spiritual Events India) ముఖ్యపాత్ర పోషిస్తాయని తెలిపారు. ప్రజలందరూ ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొని సానుకూల జీవన విధానాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బాన్సువాడ పట్టణానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


